Murder: ప్రజా దీవెన, హైదరాబాద్: పార్కింగ్ విషయంలో నెలకొన్న వివాదం చిలి కిచిలికి చివరికి ప్రాణం తీసివరకు చేరుకుంది. హైదరాబాద్ చైతన్య పురి ఠాణా పరిధిలో దారుణం జ రిగి అపార్ట్మెంట్లో పార్కింగ్ విష యమై జరిగిన గొడవ ఒకరి ప్రాణా లు తీసింది. కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో ఈ నెల 21న ఈ దారుణ ఘటన జరగగా ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి కుటుంబంతో కలిసి 13 ఏళ్లుగా కొత్తపేటలోని వైష్ణవి రు తిక అపార్ట్మెంట్లో నివాసం ఉం టున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా అదే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్-402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆ మె అల్లుడు కృష్ణ జివ్వాజి వచ్చా రు. ఆయన తన కారును అపార్ట్ మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు. గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక నిలి పాడు.కృష్ణ జివ్వాజి తిరిగి వెళ్లేం దుకు కిందికి రాగా తన కారుపై గీత లు కనిపించాయి. అందుకు నాగిరె డ్డి కారణమని, వాచ్మెన్తో అతడి ని కిందికి రప్పించి దాడి చేశాడు.
దాంతో నాగిరెడ్డి చెవిలోంచి రక్తం, నోటిలోంచి నురుగ వచ్చి పడిపోవ డంతో కుటుంబ సభ్యులు ఆసుప త్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.అదే రోజు రాత్రి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. నాగిరెడ్డి కిందపడగానే దాడి చేసిన కృష్ణ జివ్వాజి పరారయ్యా డు. కామాక్షి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. పోస్టుమార్టం అనం తరం కుటుంబ సభ్యులు నాగిరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసు కెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
కేసు గురించి మీడియాకు వెల్లడించ కపోవడంతో పాటు నిందితుడిని అ రెస్టు చేయకపోవడాన్ని అపార్ట్మెం ట్ వాసులు ప్రశ్నించడంతో ఈ ఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రని పోలీసులు తెలిపారు.