Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagar Kurnool: శిథిలమైన బతుకులు

–మట్టి మిద్దె కూలి నలిగిపోయిన నలుగురు జీవితాలు
–వానకు తడిసి తెల్లవారుజామున కుప్పకూలిన పైకప్పు
–దుర్ఘటనలో తల్లి, ముగ్గురు చిన్నారుల దుర్మరణం

Nagar Kurnool: ప్రజా దీవెన, నాగర్‌కర్నూల్‌: తెల్లవారేసరికి నిండు బతుకులు తెలియకుండానే తేలిపోయాయి. తెల్ల వారుజామున గాఢనిద్రలో (sleeping) ఉన్న వారి బతుకులు శిధిలమయ్యాయి. నిలువ నీడనిస్తుoదనుకున్న మిద్దెనే నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. తెలియకుండానే మట్టిమిద్దె ఉన్నఫలంగా కుప్పకూలడoతో (collapse)నిద్రిస్తున్న ఐదుగురిని కప్పేసింది. ఈ దుర్ఘటనలో నలుగురు నిద్రలోనే తుది శ్వాస విడవగా ఇంకొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. నాగర్‌కర్నూల్‌(Nagar Kurnool) జిల్లాలో సోమవారం జరిగిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి (family) చెందిన నలుగురు అసువులు బాసారు. రూరల్‌ మండలం వన పట్ల గ్రామానికి చెందిన గొడుగు భా స్కర్‌ ఆటో డ్రైవర్‌ అతడికి భార్య పద్మ (26), కవల కూతుళ్లు పప్పి (6), వసంత (6), కుమారుడు విక్కీ (1) ఉన్నారు. ఈ కుటుంబం తమ పూర్వీకులకు సంబంధించిన మట్టి మిద్దె ఇంట్లో నివసిస్తోంది.

ఆ ఇంటికి ఉన్న దూలాల్లో ఒకటి కొన్నాళ్ల క్రితమే విరిగిపోగా ఆదివారం కురిసిన వర్షానికి (rains) మిద్దె పూర్తిగా తడిసిము ద్దైంది. ఆదివారం రాత్రి ఇంట్లో పద్మ, ముగ్గురు పిల్లల తో పాటు భాస్కర్‌ బీరువా పక్కన పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున మట్టిమిద్దె కూలిపోగా భాస్కర్‌ స్వ ల్ప గాయాలతో శిధిలాల నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న బంధువులకు విషయం చెప్పాడు. వారంతా వచ్చి రాళ్లు, మట్టిని తొల గించి పద్మ, పప్పి, వసంత, విక్కీని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురూ మృతిచెందినట్లు వైద్యు లు (docters)నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలె క్టర్‌ బదావత్‌ సంతోష్‌ పరిశీలించా రు. అంత్యక్రియల (funeral) నిమిత్తం 25 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే(mla) అందిం చారు. మృతులకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.