National Mathematics Day : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గణిత శాఖ (Department of Mathematics) మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (Council of Science and Technology) ఆధ్వర్యంలో జాతీయ గణిత దినో త్స వ (National Mathematics Day )ఉత్సవాల ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా సంద ర్భంగా గణిత విభాగాధిపతి, సమ న్వయకర్త డా. మద్దిలేటి పసుపుల అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సమావేశంలో ఉపకుల పతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సే న్ ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీని వాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులను అధ్యాపకులకు శ్రీనివాస రామా నుజన్ సేవలను వివరించారు. రామానుజన్ చేసిన గణిత రచ నలు ప్రపంచ పటంలో భారతదేశా నికి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చా య న్నారు.
యావత్ జాతికి (races) గర్వకా రణమైన మహానుభా వులను ఆదర్శంగా తీసుకొని విద్యలో పరి శోధనలో రాణించాలని ఆశించారు. ఈ జాతీయ సమావేశానికి ప్రధాన వక్తగా హాజరైన డాక్టర్ కొల్లోజు పనింద్ర ” గణిత శాస్త్ర (Mathematics) అధ్యయ నంలో ఆధునిక పోకడలు, శాస్త్ర, సాంకేతిక రంగంలో గణిత పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వివ రించారు. 23 వ తారీఖున క్విజ్ వ్యాసరచన, వకృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన ఉపకులపతి (Vice Chancellor) చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గణిత విభాగ అధ్యాప కుల ను, విద్యార్థులను ఉప కులపతి ప్రత్యేకంగా అభినం దించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ వసంత, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. ప్రేమ్ సాగర్, కన్వీనర్ డా. జి ఉపేందర్ రెడ్డి, కో కన్వీనర్ డా.హైమావతి, మరియు అధ్యాపకులు డా. ఏ శ్రీనివాస్ డా.కిరణ్ కుమార్ డా. ఎం రామచంద్రు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.