Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pakistan Invites Modi: మోదీకి పాక్ ఆహ్వానం

Pakistan Invites Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని పాకిస్థాన్ ఇస్లామాబాద్‌ (Islamabad)కు ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (Council of Heads of Government) సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)కు చెందిన ఇతర నేతలను ఆహ్వానించింది.

గతేడాది ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్ నగరంలో నిర్వహించిన ఎస్సీవో సదస్సు (SCVO conference)కు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షిజిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.

కాగా పాక్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యం లో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని సంబంధింత వర్గాల సమాచారం. గతంలో మాదిరిగానే భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ (External Affairs Minister Jaishankar) అక్కడకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.