Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palla Venkata Reddy : వక్స్ సవరణ చట్టాని వెనక్కి తీసుకోవాలి

–సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి

Palla Venkata Reddy :ప్రజాదీవెన నల్గొండ :కేంద్రంలోమోడిప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బోర్డు సవరణ చట్టం మైనార్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని వెంటనే చట్టం సవరణను వెనక్కి తీసుకోవాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సిపిఐ నల్లగొండ జిల్లా సమితి కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక మగ్దుం భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి పల్లా వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వక్స్ బోర్డు సవరణ చట్టనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా స్వామ్యవాదులు, మేధావులు, ఉద్యమకారులను అన్నివర్గాల ప్రజలు కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి పోరాటాల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంపన్న వర్గాలకు దేశ సంపదను కట్టబెట్టడం కాకుండా వారికి అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చి పేద ప్రజల పై ధరలు పనుల భారం మోపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 500 రూపాయలు గ్యాస్ పై రాయితీ ఇస్తుంటే కేంద్రప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని ఎత్తివేసి భూ భారతి తీసుకురావడం జరుగుతుందని ఈ భూ భారతి ద్వారా నైనా కొన్ని ఏళ్ల నుండి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

వరి ధాన్యం కొనుగోలు వేగమంతం చేయాలి…

వాతావరణం మార్పుల వల్ల వడగాలులతో కురుస్తున్న అకాల వర్షాల వలన ఆరుగాలాలు రైతులు కష్టపడి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయని వెంటనే సర్వే చేసి నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం కొనుగోలు వేగమంతం చేయాలన్నారు. సిపిఐ గ్రామ శాఖ, మండల సమితి మహాసభలు మే, జూన్ మాసంలో జిల్లా వ్యాప్తంగా ఉత్సాపూరితంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్. అంజయ్య చారి, బులుగూరి నరసింహ, టి. వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.