INDIA Alliance: మోదీని ప్రజలు తిరస్కరించారు
రాజ్యాంగం పై మోదీ, అమిత్ షా దాడిని ప్రజ లు తిరస్కరించారని కాంగ్రెస్ అగ్రనే త రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలి స్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృ ప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోరాడాం
మా పోరాటం ముగియలేదు, కొనసాగుతోంది
టీడీపీ,జేడీయూ మా పాత మిత్రులని గుర్తించండి
ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే
నేడు ఇండియా కూటమి భాగస్వా మ్య పక్షాల భేటీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రాజ్యాంగం పై మోదీ, అమిత్ షా(Amit Shah)దాడిని ప్రజ లు తిరస్కరించారని కాంగ్రెస్ అగ్రనే త రాహుల్ గాంధీ(Rahul Gandhi)అన్నారు. మోదీ, అమిత్ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలి స్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృ ప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు. అలాగే, మోదీ, అదా నీ ఒకటే అని ప్రజలకు అర్థమైపో యిందని, మోదీ ప్రధానిగా లేకపోతే అదానీ కూడా ఉండలేరని స్టాక్ మార్కెట్ సూచీలు చెబుతున్నాయ న్నారు. అదానీ, మోదీకి అవినీతి సంబంధాలున్నాయని ఆరోపించా రు. మంగళవారం సాయంత్రం ఇక్కడ కాంగ్రెస్(Congress) కేంద్ర కార్యాలయం లో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ,(Sonia Gandhi)జైరాం రమేశ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికల్లో పోరాడామని, మోదీ ప్రభుత్వం మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినప్పుడు, ముఖ్యమం త్రులను జైల్లో పెట్టినప్పుడు, పార్టీ లను విచ్ఛిన్నం చేసినప్పుడు దేశ ప్రజలు ఐక్యంగా పోరాడతారని నేను భావించాను.
ఇది నిజమని లోక్సభ ఎన్నికల ఫలితాలతో రుజు వైందని, ఈ పోరాటంలో దేశంలోని నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు ఇండియా కూటమికి అండగా నిలబడ్డాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ పాత మిత్రులైన జేడీయూ, టీడీపీలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి(Alliance of India)నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అందు కోసం బుధవారం సాయంత్రం ఇండి యా కూటమిలోని భాగస్వా మ్య పక్షాలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఇందులో చర్చించనున్నట్లు తెలి పారు. మిత్రపక్షాల అభిప్రాయం అడగకుండా ఏమీ మాట్లాడబోమని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 ఎంపీ సీట్లకు దూరంగా ఉన్న బీజేపీ కేవలం అతిపెద్ద పార్టీగానే అవతరిం చనుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒక రాజకీయ పార్టీకి వ్యతి రేకంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదని పేర్కొ న్నా రు. బీజేపీతో పాటు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరే కంగా ఎన్నికల్లో పోరాడామని చెప్పారు. ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
People rejected Modi