YCP MLA Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్?
ఆంద్రప్రదేశ్ లో ఎన్ని కల సందర్భంగా ఈవీఎంని పగల గొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ లో ఎన్ని కల సందర్భంగా ఈవీఎంని పగల గొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని(Pinnelli Ramakrishna Reddy) పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. హైదారాబాద్ నగరం సమీపములో సంగారెడ్డి(Sangareddy) ప్రాంతంలో ఆయనను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే పిన్నెల్లి అరెస్ట్ని పోలీసులు ఇప్పటివరకు నిర్ధారించకపోవడం తో సస్పెన్స్ నెలకొంది. కాగా ఎమ్మె ల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి కోసం బుధవారం ఉదయం నుంచి పోలీ సులు గాలిస్తున్న విషయం తెలిసిం దే కాగా కేసు నమోదు అయిన వెంటనే అజ్ఞాంతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy) మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు షెల్టర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రా మూలాలు ఉన్న పత్తి వ్యాపారులు ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ఏపీ పోలీసులు తనిఖీలు చేపడుతు న్నారు. అయితే ఏపీ పోలీసులకు ఇంతవరకు పిన్నెల్లి ఆచూకీ లభించ లేదని తెలుస్తోంది. పిన్నెల్లి ఇద్దరు సోదరులు(Brothers) కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉండడంతోనే పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా ఏపీలో ని పల్నాడు జిల్లాలో మాచర్ల నియో జకవర్గంలోని పాల్వాయిగేట్ పోలిం గ్ కేంద్రంలో (202) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యా ట్ మిషన్లను ధ్వంసం చేసిన విష యం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణలో కూడా వేట కొనసాగుతోందన్నారు.
Pinnelli Ramakrishna Reddy arrested