Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahul Gandhi: మణిపూర్ శాంతి పై మనస్సు పెడతా

–ప్రధాని బాధితులకు ఓదార్పు దక్కే లా చూడాలి
–పునరావాస శిబిరాల్లోని మణి పూర్‌ అల్లర్ల బాధి తులను పరా మర్శించిన రాహుల్

Rahul Gandhi: ప్రజా దీవెన, ఇంఫాల్‌: ‘నేను మీ సోద రుడిగా ఇక్కడకు వచ్చాను. మణిపూర్‌లో శాంతి నెలకొ ల్పేం దుకు మీతో కలిసి పనిచేస్తానని లోక్‌స భలో కాంగ్రెస్‌ పక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మణిపూర్‌లో (Manipur) అల్లర్లు చెలరేగిన తర్వాత తానిక్కడకు రావడం మూ డోసా రని, పరిస్థితి కొంత మెరుగు పడి ఉంటుందని భావించానని, కానీ నిరాశే ఎదు రైందని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస శిబిరా ల్లో తలదాచు కుంటున్న ‘మణిపూర్‌ అల్లర్ల’ బాధి తులను రాహుల్‌ సోమవారం పరా మర్శించారు. జిరిబమ్‌, చురా చంద్‌పూర్‌ జిల్లాలోని శిబిరాలకు వెళ్లిన రాహుల్‌ అక్కడి వారితో మాట్లా డారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటిం చి, బాధితులకు ఓదార్పు దక్కేలా చూడాలని ప్రధాని మోదీని కోరుతు న్నానని, ఇక్కడ శాంతి నెలకొనేం దుకు తాము చేయగలిగిందంతా చేస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు.

‘ప్రధాని (prime minster) రాష్ట్రంలో పర్యటించాలి. ప్రజల ఆవేదనను స్వయంగా వినాలి. అప్పుడే వారికి కొంత ఊరట లభించవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజల బాగోగులపై రాహుల్‌కున్న చిత్త శుద్ధికి ఈ పర్యటనే నిదర్శనమని కాంగ్రెస్‌ తన ‘ఎక్స్‌’ సందేశంలో పే ర్కొంది. ఈ సందర్భంగా రాహుల్‌తో (rahul)ఒక బాలిక మాట్లాడుతూ ప్రధాని, రాష్ట్ర సీఎం తమ ప్రాంతాలకు ఒక్క సారి కూడా రాలేదని, తమ దుస్థి తిని పార్లమెంట్‌లో చర్చకు తేవా లని కోరిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్య క్షుడు మేఘచంద్ర తెలిపారు. కాగా, గత ఏడాది మే నుంచి మణిపూర్‌ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో (A violent incident) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిరాశ్రయులైన వేలాది మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.

అసోం బాధితులను తక్షణం ఆదుకోవాలి.. రాహుల్‌

ప్రజా దీవెన, సిల్‌చార్‌: ‘అసోం (assam) ప్రజలకు అండగా ఉంటాను. పార్లమెంట్‌లో వారి తరఫున పోరాడే సైనికుడిలా నిలబడతాను. కేంద్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి’ అని రాహుల్‌ తన ‘ఎక్స్‌’ సందేశంలో పేర్కొన్నారు. వరదల్లో మునిగిపోయిన ప్రజలకు ఊరట కలిగించేలా కేంద్రం (central govt) వ్యవహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 24 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయని, 53 వేల మంది నిరాశ్రయులయ్యారని, 60మంది ప్రాణాలను కోల్పోయారని రాహుల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వరదరహిత అసోంను తీసుకొస్తామని బీజేపీ (bjp) హామీ ఇచ్చిందని, అయితే బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని బీజేపీ సర్కారు వరద సహాయక చర్యల కోసం రూ.10,785 కోట్లు కావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరితే వచ్చింది రూ.250 కోట్లు మాత్రమే నన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వరద సహాయక చర్యల్లో పాల్గొనా లని రాహుల్‌ (rahul)పిలుపునిచ్చారు.