Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth reddy: 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించాం

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లిం చామని, ఈనెల 8వ తేదీ లోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకున్నానని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెo: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 65 లక్షల మందికి రైతు భరోసా (Rythu bharosa)చెల్లిం చామని, ఈనెల 8వ తేదీ లోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకున్నానని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9 తర్వాత ఒక్క రైతుకైనా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేస్తూ ఒకవేళ రైతు భరోసా నిధులు అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమా పణ చెబుతారా అని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరా రు. ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) తెలిపారు.

శని వారం ఆయన కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రఘు రాంరెడ్డి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. గతంలో నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికి ఎక్కువ మెజార్టీ తెలంగాణలో ఇచ్చారన్నారు. ఖమ్మం పార్లమెంట్ భారీ మెజార్టీతో ఈసారి కూడా చరిత్రలో నిలవబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం పునాదులు వేసి ప్రపంచానికి తెలియజేసిన జిల్లా ఖమ్మం అని రేవంత్ తెలి పారు. ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

శనివారం ఆయన కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొని మాట్లాడా రు. సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రఘు రాం రెడ్డి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. గతంలో నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికి ఎక్కువ మెజార్టీ తెలంగాణలో(Telangana) ఇచ్చారన్నారు. ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో దుర్మార్గు డు అధినేతగా ఉన్న పార్టీకి మూడు సార్లు ఒక్క సీటు ఇచ్చారన్నారు. ఏ రోజు కూడా నయవంచన, నక్క బుద్ధి తప్ప మరొకటి తెలియని కేసీఅర్‌ని ఈసారి ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మకుండా బండకేసి కొట్టారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలంటే ముఖ్యమంత్రులు భయపడేంత చైతన్యం ఉన్న వారని పేర్కొన్నారు.

Rythu bharosa paid to 65 lakh people