Telangana CM Revanth Reddy: తెలంగాణకు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెం చాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దే శ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసు లు ఎవరికి చేతనైనంత వారు సహ కారం అందించాలని పిలుపునిచ్చా రు. జపాన్ దేశ పర్యటనలో భాగం గా టోక్యో నగరంలో ‘జపాన్ తెలు గు సమాఖ్య’ ఏర్పాటు చేసిన స మావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంతో పోటీ పడే విధంగా తె లంగాణను అభివృద్ధి చేసుకుందా మని ఈ సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకో వడంలో ఉన్న ఆనందం ఎంతో ఉం టుందన్నారు. న్యూయార్క్లో హ డ్సన్ రివర్ ఫ్రంట్, లండన్లో థే మ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రం ట్లతో పాటు టోక్యో నగరంలో వాట ర్ ఫ్రంట్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభి వృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టామని చెప్పారు.
కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులను గమ నిస్తున్నాం, ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవలసిన అవసం ఉందని అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అ త్యంత కీలకమైన అంశాలని ము ఖ్యమంత్రి చెప్పారు. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, ఇతర రంగా ల్లో అభివృద్ధి సాధించాలని చెప్పా రు.
ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడం లో అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు, టో క్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తె లుగు వారు పాల్గొన్నారు.