Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TTD: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం మృ తుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

TTD: ప్రజా దీవెన, తిరుపతి: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేం ద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృ తుల కుటుంబాలను పరామర్శించ డానికి వారికి భరోసా కల్పించేందు కు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిం దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ దుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటే శ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మా ర్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నా రు.


అనంతరం మీడియాతో మం త్రులు మాట్లాడుతూ ఏకాదశి ద ర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద న్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సి సి కెమెరా లు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగు తుందన్నారు.

తిరుపతి లో జరిగిన సంఘటన తెలిసినన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతి కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టక రమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్ట డం జరుగుతుందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదు కుంటుందని, మృతులు తమిళ నాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యే క వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చ డం జరుగుతుందన్నారు.