Vande Bharat Train: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించే కొరకే వందే భరత్ ట్రైన్లను (Vande Bharat Train) ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే వందే భారత్ రైలు (Vande Bharat Train)పలు ముఖ్యమైన నగరాలలో (cities)పరుగులు పెడుతున్నాయి. 50 కి పైగా వందే భరత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు చాలా ఫాస్ట్ గా ప్రజలకు సేవలను అందిస్తుంది. ఈ ట్రైన్ ముఖ్యంగా ప్రయాణికులను బాగా ఆకర్షించే విషం ఏమిటంటే.. అతి తక్కువ సమయంలోనే వారి గమ్యాన్ని చేరుకోవడం. ఇక తెలుగు రాష్ట్రాలలో సికింద్రాబాద్ – విశాఖలు (Secunderabad – Visakha) ఎంత ప్రధానమైన నగరాల్లో తెలిసిన విషయమే. ఈ తరుణంలో రైల్వే డిపార్ట్మెంట్ (Railway Department) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్తను తీసుకొని వచ్చింది. ఏపీలో చెన్నై – విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైను కూడా భీమవరం స్టేషన్ (Bhimavaram Station)వరకు పొడిగిస్తున్నట్లు వందే భారత్ ట్రైన్ నిరవకులు అప్డేట్ ఇచ్చారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో భీమవరం స్టేషన్ (Bhimavaram Station) వరకు వందేభారత్ రైలును (Vande Bharat Train) పొడిగించాలని చాలాసార్లు ప్రతిపాదనలు రావడంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నై – విజయవాడ (20677 ) మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైను (Vande Bharat Train)) భీమవరం (Bhimavaram Station)వరకు పొడిగించినట్లు రైల్వే డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ తరుణంలో ఇకనుంచి భీమవరం (Bhimavaram Station) వరకు రానుంది. ఈ సర్వీస్ జూలై నెల నుంచి ప్రారంభం అవ్వవచ్చని ఒక అంచనా.
ఈ ట్రైన్ ముందుగా చెన్నైలో (chennai)ఉదయం 5:30కు బయలుదేరగా విజయవాడకు మధ్యాహ్నం 12:10 కి చేరుకుంటుంది. మళ్లీ తిరిగి ఈ ట్రైన్ (20678 ) 3:20 కు చెన్నైకి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు విజయవాడ జంక్షన్ లో రైల్ రద్దీగా ఉండడంలో ప్లాట్ఫారం సమస్యగా మారడంతో ఈ దక్షిణ మధ్య రైల్వే భారత్ ట్రైన్ ను భీమవరం వరకు పొడిగించినట్లు సమాచారం. వాస్తవానికి విశాఖ – సికింద్రాబాద్ ట్రైన్ (Visakha – Secunderabad Train) ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా స్టాపు లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఎవరైనా ఈ ట్రైన్ ఎక్కాలంటే విజయవాడ లేదా రాజమండ్రి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ నూతన సర్వీసు ద్వారా భీమవరంలో ప్రయాణికులు అవకాశాన్ని కల్పించారు రైల్వే అధికారులు (Railway officials.)