Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

vegtables price hike : రూ.100 దాటేసిన టమాటా, పచ్చి మిర్చి.. సామాన్యులు గగ్గోలు..??

vegtables price hike : భారత్‌లో రీసెంట్ టైమ్స్‌లో పప్పు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ ధరల భారంతో సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు (Vegetables prices) కూడా అంతకంతకూ పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆల్రెడీ ఉల్లి (Onion) ధర చాలా పెరిగిపోయింది. దీనివల్ల వాటిని కొయ్యకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. హోటల్స్ వారు ఆల్రెడీ నో ఆనియన్స్ అంటూ నోటీసు బోర్డులు తగిలించేశారు. ఉల్లి ధరలు ఇలా ఆకాశాన్ని అంటుతుంటే.. మరోవైపు టమాటా ధరలు షాక్ లు ఇస్తున్నాయి.

2023లో లాగానే 2024లో కూడా టమాటాతో పాటు వివిధ రకాల వెజిటేబుల్ ప్రైసెస్ పెరుగుతూ పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కూరగాయల సాగు రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. డిమాండ్​కు తగిన దిగుబడి రాకపోవడంతో ఆటోమేటిక్‌గా ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పెరిగాయి. పచ్చిమిర్చి (Chillies) ధరలు కూడా పేదవాళ్లు కొనుగోలు చేయలేని విధంగా రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో పచ్చిమిర్చి ధర ఏకంగా రూ.120కి ఎగబాకింది. ఉల్లి కిలో రూ.50కి చేరుకుంది.

ప్రస్తుతం 17 భారతీయ రాష్ట్రాల్లో కిలో టమాటా ధర (Tomato price) రూ.50కు పైగానే పలుకుతోంది. ఇక 9 రాష్ట్రాల్లో కిలో టమాటాలను రూ.60 చొప్పున అమ్ముతున్నారు. నాలుగు రాష్ట్రాల్లో టమాటాల ధర రూ.70 కంటే ఎక్కువకు చేరుకోగా.. ఒక్క రాష్ట్రంలోనే టమాటా ధర రూ.100 క్రాస్ అయ్యింది. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్న మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల టమోటాల ఉత్పత్తి మరింత తగ్గవచ్చు. ఇంతకుముందు ఎండల తీవ్రత కారణంగా కూడా టమాటా దిగుబడి అనేది తగ్గింది. ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకుని టమోటా ధరలు రూ.100 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్‌లో టమోటా ప్రైసెస్ రూ.100 దాటేశాయి. జూన్ 20న ఇక్కడ కిలో టమాట రూ.100.33కి సేల్ అవుతోంది. కేరళలో కిలో రూ.82కి అమ్ముతున్నారు. తెలంగాణ టమాట కిలో రూ.60కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండ్ల ధర కిలో రూ.50 పలుకుతోంది.