Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

 Yadadri Thermal Power Plant: చారిత్రక ఘట్టం ఆవిష్కృతo

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రతిష్టా త్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో ట్రయల్ రన్ విజయవంతం
టీఎస్ జెన్కో సిఎండి రిజ్వి సమ క్షంలో ప్రాథమిక పరీక్షలు పూర్తి
దశలవారిగా విద్యుత్ ఉత్పత్తితో గ్రిడ్‎కు అనుసంధానానికి అడుగులు

ప్రజా దీవెన సూర్యాపేట: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రతిష్టా త్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో(Yadadri Thermal Power Plant ) చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. పవర్ ప్లాంట్‎ లో అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్‌ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్ -1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు వేసిoది. త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్‎కు అనుసం ధానం చేసేందుకు మార్గం సుగమ మైంది. ఈ ఏడాది డిసెంబర్‎లోగా మూడు యూనిట్లలో పూర్తిస్థా యిలో విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యం తో అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన పురోగతి సాధిస్తు న్నారు.

అoదులో భాగంగానే మొ దటి, రెండవ యూనిట్లలోని యాక్సిలరీ బాయిలరల్లో లైట్ అప్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇంధ నాన్ని ఉపయోగించి అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వ హించారు. 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ ద్వారా వాయును విడుదల చేస్తూ ట్రయల్ రన్ లో భాగంగా ప్రాథ మిక పరీక్షలను పూర్తి చేసి నట్లు జెన్కో అధికారులు చెబు తున్నారు. ఈ ట్రయల్ రన్ లో టీఎస్ జెన్కో సిఎండి రిజ్వి సమ క్షంలో జరగడo గమనార్హం. కాగా నల్లగొండ జిల్లా దామరచర్ల మం డలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్(Yadadri Thermal Power Plant ) నిర్మాణాన్ని చేప ట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూ పర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణా న్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. ఒక్కో యూనిట్‎లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.

పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడు వుకన్నా రెండేళ్లు ఎక్కువ కావ డంతో అంచనా వ్యయం రూ.29, 500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది. తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరింది.యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలో జరిగా యని రెండు స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(National Green Tribunal) (ఎన్జీటి)కి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్జీటి యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణానికి పర్యావరణ అనుమ తులను నిలిపివేసింది. దీంతో ప్లాంట్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర అధికారులు గత ఏడాది నవంబర్ 8న మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పర్యా వరణ అనుమతుల కోసం ప్రతిపాద నలను కేంద్రానికి పంపారు. వీటిని పరిశీలించిన నిపుణుల మదింపు కమిటీ ప్లాంటు రెండో దశ నిర్మాణా నికి అనుమతులను సిఫార్సులను చేసింది.

కొన్ని షరతులతో కూడిన అనుమతిని పర్యావరణ శాఖ మంజూరు చేసింది. దీంతో పవర్ ప్లాంట్ పనులను జెన్‎కో అధికారు లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్‌ పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్ నుంచి తరలిం చేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపు లైన్ పనులు, రిజర్వా యర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి కావలసిన బొగ్గును దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వర కు 8.5 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కూడా నిర్మిస్తున్నారు. హైటెన్షన్‌ విద్యుత్‌లైన్‌(High tension power line) టవర్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తానికి యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ పురోగతి సాధించడం పట్ల సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Yadadri Thermal Power Plant Trial run successful