Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay kumar: ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగితే బిచ్చగాళ్లంటారా

బీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పు కుని ఓట్లు అడుక్కునే బిచ్చగా ళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డిబీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పు కుని ఓట్లు అడుక్కునే బిచ్చగా ళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ స్పందించారు.చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ స్పందించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాదిరి గా ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో ఓట్లు కొనాలనుకునే వాళ్లం కాదు
ఓటుకు రూ.వెయ్యి పంచాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్ర
ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలి
ఇదిగో ఎములాడ కోసం నేను రాసిన లేఖ
ప్రసాద్ స్కీం కింద నిధులిస్తామని కేంద్రం చెప్పినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఇంకా సిగ్గు లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నన్ను విమర్శిస్తారా
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ ఫైర్

ప్రజా దీవెన, చొప్పదండి: బీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పు కుని ఓట్లు అడుక్కునే బిచ్చగా ళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో చేసిన పనులను చెప్పుకుని ఓట్లు అడిగే వాళ్లు బిచ్చగాళ్లయితే… తాము కూడా బిచ్చగాళ్లమేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా అవినీతి సొమ్ముతో, ఫోన్ ట్యాపింగ్ డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం తమకు చేతకాదన్నారు. తాము ప్రజాస్వామ్యబద్దంగా చేసిన పనిని చెప్పుకోవడంతోపాటు ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను, సేవలను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లను అభ్యర్ధిస్తామన్నరు. దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నామని హేళనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చేస్తుందేమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మకపోయేసరికి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద, భద్రాద్రి రాముడి మీద, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేసి అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. దేవుడిని హేళన చేస్తున్న వాళ్లకు చివరకు దేవుడే దిక్కయ్యాడన్నారు. రాముడి అక్షింతలు, తీర్ధ ప్రసాదాలను అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాముడి భక్తులెవరూ ఓట్లు వేయబోరనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు.

గురువారం ఉదయం గంగాధర మండలంలోని వెంకటాయపల్లె ఎల్ కే కన్వెన్షన్ లో జరిగిన చొప్పదండి నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో బండి సంజయ్ పాల్గొని ఎన్నికల నేపథ్యం లో ఏజెంట్లు తీసుకోవా ల్సిన జాగ్రత్తలు, పోలింగ్ శాతం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచన లిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వివిధ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన సంజయ్ ఎన్నికల్లో బీజేపీ గెలపుకోసం పని చేయాలని కోరారు.

అక్కడి నుండి తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గస్థాయి పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో బండి సంజయ్ పాల్గొని పోలింగ్ ఏజెంట్లు చేపట్టాల్సిన కార్యక్రమాలను, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘ఫోన్ ట్యాపింగ్ పైసలతో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించడానికి బీఆర్ఎస్ కూడా యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నరు. అందుకే ఓటుకు రూ.వెయ్యి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులను కోరేదొక్కటే. ఫోన్ ట్యాపింగ్ సీరియస్ అంశం. ఆ డబ్బులతో ఓట్లు కొనాలనుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై డేగ కన్ను వేయాలి. పూర్తిస్థాయి నిఘా పెట్టాలి.’’అని కోరారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివ్రుద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని, ఎంపీగా ఉంటూ బండి సంజయ్ నయాపైసా తేలేదంటూ మంత్రి పొన్నం, బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా తీవ్రంగా స్పందించారు. ప్రసాద్ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే ఎములాడ, కొండగట్టు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివ్రుద్ది చేస్తామని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా, కేంద్రం నుండి లేఖ రాసినా నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు నాడు ప్రభుత్వానికి రాసిన లేఖలను విడుదల చేశారు.

2020లో బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాస్తే, స్పందించిన కేంద్రం 2022లో ఎములాడ రాజన్న ఆలయ అభివ్రుద్దిపై ప్రతిపాదనలు పంపాలంటూ రాసిన లేఖను మీడియాకు చూపించారు. ఎములాడ రాజన్నను, కొండగట్టు అంజన్న ఆలయాలు అభివ్రుద్ధికి నోచుకోకపోవడానికి ముమ్మాటికీ నాటి కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు. ఎములాడ ఆలయ అభివ్రుద్ధికి ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు విడుదల చేసి అద్బుతంగా అభివ్రుద్ధి చేస్తానని రాజన్న సాక్షిగా హామీలిచ్చిన కేసీఆర్ నయాపైసా ఇవ్వకుండా 9 ఏళ్లపాటు గాలికొదిలేశారన్నారు.

కొండగట్టు అంజన్న ఆలయానికి సైతం రూ.వంద కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. దేవుళ్లకే శఠగోపం పెట్టిన 420 నేతలు బీఆర్ఎసోళ్లేనని, వాళ్లకు తగిన శాస్తి జరిగిందన్నారు. అయినా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ అభ్యర్ధి తమపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివ్రుద్ధి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రాన్ని పాలించిన ఈ రెండు పార్టీల నిర్వాకంవల్లే ఆలయాలు అభివ్రుద్దికి నోచుకోలేదన్నారు. తనను గెలిపిస్త ఈ రెండు ఆలయాల అభివ్రుద్దిపై ప్రత్యేక ఫోకస్ పెడతానని హామీ ఇచ్చారు.

BJP ask for votes like as beggars in democracy