Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay kumar: ప్రలోభాలకు గురిచేస్తున్న కాంగ్రెస్

కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, హాఫ్ బాటిల్ మందు ను పంపిణీ చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

 ఎన్నికల  సంఘం చోద్యం చూస్తోంది
 ‘సీ విజిల్’ కు ఫిర్యాదు చేస్తే చర్య లు తీసుకోకుండా సమాచారం అందించి దొంగలను కాపాడుతు న్నారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్

ప్రజా దీవెన, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజక(Parliament elections) వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, హాఫ్ బాటిల్ మందు ను పంపిణీ చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బరితెగించి బాహా టంగానే డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారు లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై ‘సీ విజిల్’ యాప్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోక పోగా, డబ్బులు పంచుతున్న నేతలకు సమాచారం పంపి సహకరిస్తున్నారని మండిపడ్డారు.

సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్(Karimnagar) లో కాంగ్రెస్ పార్టీ(congress party) పైసలతో అడ్డదారుల్లో గెలవాలని చేస్తోందన్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున డబ్బులను డంప్ చేశారన్నారు. “కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుతోంది. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి, ఇంటికి హాఫ్ బాటిల్ చొప్పున 15 లక్షల మందికి పంపిణీ చేస్తూ ఓట్లను కొని గెలవాలని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.అధికారులు, పోలీసుల సహకారం లేకుండా ఇంటింటికీ డబ్బుల పంపిణీ సాధ్యమా కళ్లముందే డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా ఎన్నికల కమిషన్ చోద్యం చూడటం వెనుక మర్మమేమిటని, ఇంకా బాధాకరమేందంటే డబ్బు, మద్యం పంపిణీపై బీజేపీ కార్యక ర్తలు, ప్రజలు సీ విజిల్ లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోక పోగా ఆ సమాచారాన్ని కాంగ్రెస్ నేతలకు పంపి వారిని కాపాడే ప్రయత్నం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

అట్లాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు ఓటింగ్(Voting) కు ఏర్పాటు చేయడానికే పరిమిత మవుతారా అని ప్రశ్నించారు. ఇప్ప టికైనా ఎన్నికల కమిషన్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, లేనిపక్షం లో ఎన్నికల సంఘం పట్ల నమ్మకం లేకుండా పోతోందని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న పార్టీలు, నాయ కులపై తీవ్రమైన చర్యలు తీసుకో వాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ(BJP) కార్యకర్తలే డబ్బులను గుంజుకుని ప్రజలకు పంచే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లు కాదనే సంగతిని గుర్తుంచుకుని చర్యలు తీసుకోవాలన్నారు.

Congress distributed money and wine to voters