Bandi Sanjay Nomination: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ
పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 పైచిలుకు సీట్లు ఖాయమని, తద్వారా ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలియజేశారు.
ఎంపి ఎన్నికల్లో బిజెపి కి 400 పైచిలుకు సీట్లు ఖాయo
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
బండి నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్
ప్రజా దీవెన, కరీంనగర్:పార్లమెంటు ఎన్నికల్లో (Parliament elections) భారతీయ జనతా పార్టీకి 400 పైచిలుకు సీట్లు ఖాయమని, తద్వారా ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలియజేశారు. గురువారం కరీంన గర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించా రు. ఇప్పటికే బీజేపీకి ఒక ఎంపీ స్థానం వచ్చిందని, 400కు పైగా స్థానాలను గెలిచి ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకా రం చేయడం ఖాయం అయిపో యిందన్నారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షులు కిషన్ రెడ్డి మాట్లా డుతూ తెలంగాణలో 17సీ ట్లు బీజేపీ గెలవబోతుందన్నారు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీం కు కెప్టెన్ లేడని, తమ కెప్టెన్ నరేంద్ర మోడీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేన ని, వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నా రు.లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం గెలిపిం చాలన్నారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృ త్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని, మోదీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారన్నారు. మోదీని ఆశీర్వదిస్తే తెలంగాణ సంక్షేమాన్ని చూసుకుంటారన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవం పెరిగిందన్నారు. భారత విద్యార్థు లను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీ కే దక్కుతుందన్నారు.
అంతకు ముందు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్(Nominations) నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి లు హాజర య్యారు. కరీంనగర్ లోని కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.
Narendra Modi is third time prime minister