Parliament elections PM Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ ‘ఫ్యామిలీ’ పార్టీలు
--అవినీతి, అక్రమాల్లో విడదీయరాని భావసారూప్యతలు --బిజెపి కి జాతీయత అయితే ఆ పార్టీలకు కుటుంబాల బాధ్యత --రామమందిరం నిర్మిస్తే కాంగ్రెస్ దుఃఖంలో మునిగిపోయింది --ట్రిపుల్ ఆర్ సినిమా కంటే 'ఆర్ ఆర్' వసూళ్లు జరుగుతున్నాయి --వేములవాడ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ ధ్వజం
కాంగ్రెస్, బీఆర్ఎస్
ఫెవికాల్ ‘ఫ్యామిలీ’ పార్టీలు
–అవినీతి, అక్రమాల్లో విడదీయరాని భావసారూప్యతలు
–బిజెపి కి జాతీయత అయితే ఆ పార్టీలకు కుటుంబాల బాధ్యత
–రామమందిరం నిర్మిస్తే కాంగ్రెస్ దుఃఖంలో మునిగిపోయింది
–ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ‘ఆర్ ఆర్’ వసూళ్లు జరుగుతున్నాయి
–వేములవాడ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ ధ్వజం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చోప చర్చ లు కొనసాగు తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( modi) పేర్కొ న్నారు. ట్రిపుల్ఆర్ సినిమా కంటే ఎక్కువ వసూ ళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ‘ఆర్’ తెలంగాణ ను దోచుకుని ఢిల్లీలో ఉన్న మరో ‘ఆర్’కు పంపుతున్నార ని పరోక్షంగా రేవంత్, రాహుల్ గాంధీని ( Rahul Gandhi) ఉద్దేశించి విమర్శించారు.
ఈ ఎన్నికల్లో ‘ఆర్ ఆర్’ నుంచి తెలంగాణను విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, అవినీతి అనే ఫెవికాల్ ఈ రెండు పార్టీలను కలుపుతోందని ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి జాతీయత మొదటిదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కుటుంబమే మొదటిదని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూ జల అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయోధ్య రామమందిరం నిర్మి స్తే కాంగ్రెస్ దుఃఖం, కోపంతో ఉందన్నారు. కోర్టు నిర్ణయంతో అయోధ్య ( ayodhya ) మందిరాన్ని నిర్మించామని, కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కోర్టు తీర్పును సవాల్ చేస్తామంటున్నా రని ఫైర్ అయ్యారు. రామమందిరాన్ని రక్షించుకోవాలంటే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయాలని పిలుపు నిచ్చారు.
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ బండి గెలు పు ఖాయమైందని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని, వేములవాడ సభలో ప్రధాని నరేంద్రమోడీ గాడిద గుడ్డు సర్కార్ కాంగ్రెస్సే, ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్సే గాడిద గుడ్డు సర్కార్ అని సెటైర్ వేశారు.
ప్రధాని మోది కరీంనగర్ పార్ల మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 12వేల కోట్లు ఖర్చుచేశారని తెలిపారు. మోడీ మేడ్ ఇన్ ఖారత్, సోనియా ( soniya) ఇన్ ఇటలీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మేడ్ ఇన్ బ్రిటిష్ కాదా అని ప్రశ్నించారు. పక్కా లోకల్ మోడీ కావాలా, నా న్ లోకల్ రాహుల్ కావాలా అని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోడీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకు వస్తారని గుర్తుచేశారు. ఇప్పుడు వారికి అమ్మలేరు, మనమంతా మో డీ పక్షాన ఉండి మూడోసారి ప్రధానిని చేసుకుందామని, తద్వారా దేశ ప్రజలoదరం కలిసి ఆయనకు కుటుంబంగా అండగా నిలుద్దా మని పిలుపునిచ్చారు.
వరంగల్ తో బిజెపి కి అవినాభావ సంబంధం…
వరంగల్: వరంగల్ ( warangal) నగరానికి బీజేపీతో అవినా భావ సంబంధం ఉందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. నలభై ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉంటే అందులో ఒక ఎంపీ జంగారెడ్డి హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ పేర్కొన్నారు. అహ్మదా బాద్ తన కర్మభూమి అని, ఆ నగర దేవత భద్రకాళి అని తెలియ జేస్తూ వరంగల్లో కూడా నగర దేవత భద్రకాళి అని మోదీ అన్నా రు.
ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవా నికి ప్రతీక అని ఆయన అభి వర్ణిం చారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్బంగా మోదీ నమస్కా రాలు తెలిపారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వరం గల్లో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభ లో ప్రధాని మోదీ ప్రసం గించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికా రంలోకి వస్తే ఆ రాష్ట్రం ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని పేర్కొ న్నారు. అందుకు జార్ఖం డ్లో దొరికి న నగదే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నా రు.
కాంగ్రెస్ ప్రభు త్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజా నా ఖాళీ అయి పోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కుడకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతి లోకి వెళ్ల కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దేశం అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటుందన్నారు.
గతంలో దేశంలో వరుస బాంబు పేలుళ్ల జరిగేవని, ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగింద ని ఎక్కడైనా అవాంఛనీయ సంఘ టనలు చోటు చేసుకున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాల నలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, ఆ పార్టీ ఎక్కడ ఉంటుం దో అక్కడ కుంభోకోణం ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పదేళ్ల క్రితం చేసిన పాపాలను ప్రజలు మరిచిపోలేదని చెప్పారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. కానీ కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లు కత్తిరించి వాటిని ముస్లింలకు ఇచ్చిందని ఈ సంద ర్బంగా మోదీ గుర్తు చేశారు.ఇదే తరహా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని గమనిస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందు రాదు కానీ ముస్లింలకు ఆ రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు ముందుకు వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయంతో ఓబీసీలకు తీవ్ర నష్టం జరుగు తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు పడుతుందన్నారు. అయితే మాదిగ లకు తాను ఇచ్చిన హామీ మరిచిపోలేదన్నారు. ఇక బీఆర్ఎస్ సైతం బుజ్జగింపు రాజకీయాలే చేస్తుందని దుయ్యబట్టారు. 2014 లో దళి త వ్యక్తి సీఎంగా చెస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిం చారని చెప్పారు.
నాలుగో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సీట్ల కోసం భూతద్దంలో కాదు మైక్రో స్కోప్లో వెతుకోవాల్సి ఉంటుం దన్నారు. సమ్మక, సార క్క గిరిజన యూనివర్విటీకి కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటంకాలు పెడుతుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందన్నారు.
2014లో తాము అధికారంలోకి రాగానే దళిత వ్యక్తి రామనాథ్ కోవిం ద్ను రాష్ట్రప తిగా చేశామని, అలాగే 2019లో అదివాసీలకు చెంది న ద్రౌపది ముర్మును రాష్ట్రప తిని చేశామని తెలిపారు.అంటే చర్మం రంగును బట్టి ద్రౌపది ముర్ము ను ఆఫ్రికన్ అని కాంగ్రెస్ వాళ్లు భావిం చి ఉంటారన్నారు. అందుకే ఆమెను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుందని విపులీకరించారు.
దేశంలో చాలా మందికి నలుపు చర్మం ఉంటుదన్నారు. ఈ నలుపు ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం చేసుకోవాలని ఈ సందర్భం గా మోదీ పేర్కొన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు రంగు నీలం, నలుపు అని మోదీ గుర్తు చేశారు.సోనియా జన్మదినం రోజు రుణ మాఫీ చేస్తా నని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, చివరకు ఆగస్ట్ 15వ తేదీకి రుణమాఫీ ని మార్చరన్నారు. సనాతన ధర్మాన్ని తిట్టే వారిని నమ్మగలమా అని మోదీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
PM modi speech in vemulawada