Bandi Sanjay Kumar : దేవుళ్లంటే దేనికి అంత చులకన
ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథమని, అందులో పొందుపర్చిన ఆరు గ్యా రంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పి తడబడుతున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
మేనిఫెస్టో పవిత్ర గ్రంథమoటూ రైతులను మోసం చేస్తారా
హామీలను అమలు చేయమంటే మళ్లీ దేవుడి పై ప్రమాణం చేసి రుణ మాఫీ చేస్తామంటారా
రైతులు, ప్రజలు ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ సంగతి తేలుస్తరు
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు
కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
ప్రజా దీవెన, హుస్నాబాద్: ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథమని, అందులో పొందుపర్చిన ఆరు గ్యా రంటీలను( Six guarantees)వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పి తడబడుతున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (MP Bandi sanjay)ధ్వజమెత్తారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక అపసోపాలు పడుతున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనర్సిం హస్వామి మీద ప్రమాణం చేస్తూ దేవుడిని అవమానపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. నేనడుగుతున్నా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దేవు ళ్లను, భగవద్గీత, బైబిల్, ఖరాన్ లను వాడుకుంటారా, ఎన్ని కలైపోంగనే వాటిని గాలికొదిలేస్తారా దేవుళ్లంటే మీకు అంత చులకనా అంటూ ఆయన మండిపడ్డారు.
సోమవారం ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ వడ్ల కొనుగోలు కేందాన్ని సందర్శించారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందుల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు(Farmers)వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నా మని ఏకరవు పెట్టారు.
ఈ సంధ ర్బంగా కొందరు ఇక్కడ చాలా ఇ బ్బంది పడుతున్నామని అధి కారులు ఎంత చెప్పినా వడ్లలో కటింగ్ పెడుతున్నారని, వానొస్తే భయమైతుంది, టార్పాలిన్లు ఇవ్వడం లేదని, కనీస సౌకర్యాల్లేవు లేకపోగా తాలు, తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఇవన్నీ మీలాంటోళ్లకు చెబుదామంటే రైతు లను ఇక్కడున్నోళ్లు భయపెడుతు న్నారని, దీంతో రైతులెవరూ మాట్లా డటానికి ముందుకు రావడం లేదని, రైతులే దేశానికి వెన్నుముక అంట రు, రైతుల వెన్నుపూస ఇరగ్గొడు తున్నరని, రైతుల ఆవేదనను విన్ని బండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలవల్ల చాలా ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నరని, వాళ్ల బాధలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని, వానలతో ఎంతో కొంత వడ్లు తడిస్తే దానిని పట్టుకుని ఇక్క డికి వచ్చి వడ్లన్నీ తడిశాయంటూ పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నరని తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు 10 కిలోల దాకా కోత పెడుతున్నరని, ప్రభు త్వం పైకి మాత్రం రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలు పేపర్లకే పరిమితమ య్యాయని విమర్శించారు.
కచ్చితంగా వడ్లలో గంప గుత్తగా కటింగ్ పెడుతున్నరని, కనీస మద్ద తు కూడా రైతులకు దొరకడం లేదు. 16 నుండి 17 వందలకే వడ్లు కొనే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికల మేనిఫెస్టో తమ కు బైబిల్, ఖరాన్, భగవద్గీ తతో సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress party)ఇప్పటి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని మళ్లీ మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. నేనడుగుతున్న తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫె స్టోలో చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు.
అలా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందే మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హమీ ఇచ్చారని, వడ్లతోపాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వడానికి రూ. 5వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లన్నీ కొనా లంటే ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం పడుతుందని, ఈ రెండు హామీల అమలు కోసం రూ.5700 కోట్ల నిధులు అవసరముంటుందని చెప్పారు. వాటినే ఖర్చు చేయ కుం డా రైతులను నిండా ముంచు తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమ లు కోసం రూ.30 వేల కోట్లను విడు దల చేస్తామంటే నమ్మేదెవరని ఎద్దేవా చేశారు.
తక్కువ బడ్జెట్ లో ఇచ్చిన హామీలనే అమలే చేయని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15లోపు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మేదెవరని అసలు కాంగ్రెస్ పార్టీకి దేవుడి మీద, బైబిల్, భగవ ద్గీత, ఖురాన్ మీద విశ్వాసం ఉందా ఉంటే ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాం గ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్ల కు బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొను గోలు చేయాలని, అట్లాగే తడిసిన వడ్లను పూర్తిగా కనీస మద్ధతు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
కాంగ్రేస్ హయాంతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం(Modi government) కనీస మధ్దతు ధరను రెట్టింపు చేసింధని, ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు రూ.20 వేల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారని, పొరపాటున కాం గ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీ లన్నీ ఎత్తేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదని, తద్వారా రైతులపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉందని, కాబ ట్టి రైతాంగం అన్ని వాస్తవాలు గ్రహించి ఆలోచించి ఓటేయాలని కోరారు.
Why are gods so petty