ponguleti srinivas reddy: లోక్ సభ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో(Lok sabha elections) కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమా చార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(ponguleti srinivas reddy), రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
ప్రజా దీవెన, ఖమ్మం:లోక్ సభ ఎన్నికల్లో(Lok sabha elections) కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమా చార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(ponguleti srinivas reddy), రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మతోన్మాద బీజేపీ సర్కారును గద్దె దించుదాం అని పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఖమ్మం, టీ సీ వీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమా వేశాల్లో మంత్రులు మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ప్రజల కు ఎప్పుడూ రుణపడి ఉoటామని, లోక్ సభ ఎన్నికల్లో రఘురాం రెడ్డిని ఇంతకు నాలుగు రెట్ల మెజారిటీతో పట్టం కట్టాలని అన్నారు.నేటి మా పదవులు ప్రజల చలువని అన్నా రు. అధికార మధం, అహంకారం తో విర్రవీగిన బీఆర్ఎస్ పాలకులకు ఓటర్లు చెంప చెల్లుమనిపించారని, ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కోసమైనా రాష్ట్రలోని అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. పాలేరు సమావేశానికి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హాజరవ్వగా లోక్ సభ అభ్యర్థి రఘురాం రెడ్డి సాదరంగా ఆహ్వానిం చారు.
కాంగ్రెస్(congress) విజయానికి ముమ్మ ర కృషి చేస్తానని సంభానీ ప్రకటిం చారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు క్లళెం వెంకట రెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, పీ సీ సీ నుంచి పాలేరు నియో జకవర్గ పరిశీలకులు అశోక్ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయ ల నాగేశ్వర రావు, సీనియర్ నాయ కులు మద్దినేని స్వర్ణ కుమారి, మద్ది శ్రీనివాస రెడ్డి, రామ సహాయం నరే ష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అ ధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నల్ల మల వెంకటేశ్వర రావు, జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, ఎం పీ పీ వజ్జా రమ్య, మంగీలాల్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీ పీ ఐ నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, సలాం, జానీ మియా, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, విక్రమ్, జబ్బార్, నవీన్ రెడ్డి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.
Congress party workers work like soldiers