Ponguleti Political :ప్రజా దీవెన, ఖమ్మం :బీజేపీ, బీఆర్ ఎస్ ఒకే తాను ముక్కలని, ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే మరొకరు డెలివరీ చే స్తారని, ఢిల్లీ స్థాయిలోనే మ్యాచ్ ఫి క్సింగ్ జరిగిందని తెలంగాణ రెవె న్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొమవారం ఉదయం మున్నేరు ప రీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ పనులను అధికారు లతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు.
ధనిక రాష్ట్రం అంటూ గత పాల కు లు షో చేశారని కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రాగానే లోగుట్టు మొత్తం బయట పడిందన్నారు. తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె రాసి ప్రజలను మభ్య పెట్టార ని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్ర భుత్వం చేసిన అప్పుల చిట్టా చూ సి బాదేసిందని, దాదాపు 8 లక్షల 19 కోట్ల అప్పు ఉందని వెల్లడించా రు. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తె లిపారని, ఈ రోజు ఉన్న పరిస్థితిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియాలనే చెప్పారని అన్నారు. ఇంటి పెద్దగా కుటుంబాన్ని సక్రమం గా నడిపించే ప్రయత్నం చేస్తున్నా మని, క్యాన్సర్ సోకితే ఒప్పుకోవా లని బయటకు తెలియకపోతే రో గం ముదురుతుందని పేర్కొన్నారు.
ఇదే నిజాన్ని ప్రతిపక్ష పార్టీలు కూ డా ఒప్పుకోవాలని సూచించారు.
పొద్దున లేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తు న్నాయని దుయ్యబట్టారు. సీతారా మ ప్రాజెక్టు పనులు తాము పూర్తిచే స్తే కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లుకుంటుం దన్న బీఆర్ఎస్ నేతల మాటలకు పొంగులేటి గట్టి కౌంటర్ ఇచ్చారు. 90 శాతం పనులు పూర్తిచేస్తే ఇంకా 40 శాతం పనులు ఎలా మిగిలి ఉంటాయని ప్రశ్నించారు. కనీసం డ్రైరన్ కూడా చేయని బీఆర్ఎస్ నాయకులు మోటార్లు బిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మేం తప్ప ఎవరూ ఏమి చేయలేద నే బావనలో బీఆర్ఎస్ నాయకు లు ఉన్నారని, చివరకు గాలిని కూ డా మేమే కనుగొన్నామని అంటా రేమోనని ఎద్దేవా చేశారు.
గాలిని, నీటిని, ప్రజలు తినే ఆహా రాన్ని మేమే కనుగొన్నామని అంటే ఎలా అని ప్రశ్నించారు. విమర్శలు చేయాలి తప్పు కాదు కానీ చేసే వి మర్శ సోయీపసొంపుతో ఉండాల న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని విపక్షాలు కుట్రలకు పాల్ప డుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెరవెనుక ఉండి కొందరు రైతు లను ఉసిగొలుపుతున్నారని ప్రతి పక్ష నాయకులపై ధ్వజమెత్తారు.
ఎవరెవరు కుట్రలకు పాల్పడుతు న్నారో అన్ని విషయాలు అధికారు ల వద్ద పూర్తి సమాచారంతో ఉంద న్నారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చె ప్పారని, ఇకనైన సక్రమంగా మస లుకోవాలని హితవు పలికారు. గ తేడాది అకాల వర్షాలకు మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో నివాసముం డే వేలాది కుటుంబాలు తీవ్ర ఆవేద నకు గురయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు మున్నేరు బాధితులను పరామర్శిం చి, ఆదుకుని రిటైనింగ్ వాల్ నిర్మా ణ పనులను వేగం చేశామన్నారు. తక్కువ ధరకు వస్తుందని ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదలకు రిటైనింగ్ వాల్ తో భరోసా ఉంటుందన్నారు. ఏ ఒ క్కరికీ అన్యాయం జరుగకుండా రి వర్ ఫ్రంట్ కాలనీలో చోటు కల్పి స్తా మని చెప్పారు. 450 నుంచి 500 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాల ని ప్రభుత్వం భావిస్తున్నది రిటైనింగ్ వాల్ నిర్వాసితులకు అందులో స్థా నం కల్పిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం ఆర్భాటంగా జీవో ఇచ్చి వదిలేస్తే రిటైనింగ్ వాల్ ప్రి యారిటీ ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభు త్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వైపులా 17 కిలో మీ టర్ల మేర భవిష్యత్ లో ఎలాంటి ఇ బ్బంది కలుగకుండా శాశ్వత పరి ష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. రిటైనింగ్ వాల్ కు రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం కూడా చేపడుతామని వెల్లడించా రు. మున్నేరు పరీవాహక ప్రాంతా ల్లో భూములున్న ఆసాములు ప్ర భుత్వానికి సహకరించాలని సూ చించారు.కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం చిత్తశుద్దితో పేదల పక్షా న ఉంటుందన్నారు.