–సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టును అద్భు తంగా తీర్చిదిద్దుతాం
— రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Tourism Industry : ప్రజా దీవెన, మహబూబ్ నగర్:రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కి అద్భుతమైన అవకాశాలు ఉన్నా యని, టూరిజం అభివృద్ధికి ప్ర త్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందోందని పర్యా టక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యు వల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభి వృద్ధిలో భాగంగా మంత్రి జూపల్లి సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నార్లాపూర్ రిజర్వాయ ర్, కొల్లాపూర్ లోని మాధవస్వామి ఆలయం, జెటప్రోలు మదనగోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించా రు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవ కాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. మంత్రి జూపల్లి వెంట పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజిం గ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఇతర అధి కారులు ఉన్నారు.
సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్స్ట మెంట్(సాస్కి)’ పథకం కింద రూ.6 8.10 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో పర్యావరణం, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పు ష్కలమైన వనరులు ఉన్న సోమ శిల, అమరగిరి ద్వీపం, ఈగలపెం టను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేప ట్టాలని పర్యాటక శాఖ అధి కారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజె క్టు సంబంధించిన ప్రతిపాదనలు, కార్యాచరణపై పర్యాటక శాఖ అ ధికారులతో మంత్రి సమీక్ష నిర్వ హించారు. ప్రపంచంలో ఎన్నో దేశా లు కేవలం టూరిజం ద్వారానే అభి వృద్ధి చెందాయని, రాష్ట్రాన్ని టూరి జం హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందు కువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. త్వరలో టెండర్లు పిలవాలని అధి కారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పర్యాటక రంగాన్ని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గద ర్శకత్వంలో ముందుకు తీసుకె ళ్తామని, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమా ణాలతో అభివృద్ధి చేస్తామని అన్నా రు. దేశ, విదేశీ పర్యాటకులను ఆక ర్షించడానికి కృషి చేస్తున్నామని తె లిపారు.
సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్స్ట మెంట్(సాస్కి)’ పథకం కింద రూ. 68.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆ నిధులతో పర్యావర ణం, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి ద్వీపం, మల్లే శ్వరం, ఈగలపెంటను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని వివ రించారు. సోమశిలలో బోటింగ్ జెట్టి, అమరగిరి ద్వీపంలో బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, కేఫ్టీరియా, స్పా, వెల్ నెస్ సెంటర్, ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్, ఇతర సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.