Rythu bharosa: రైతు భరోసా ఆపించింది కాంగ్రెస్సే
రాష్ట్రంలోని మిగిలిన రైతులందరికీ రెండు రోజుల్లోగా రైతుభరోసా నిధులను జమచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో ఎన్నికల కమి షన్కు తమవారితోనే ఫిర్యాదు చేయించి రైతు భరోసాను ఆపిం చారని కేసీఆర్ ఆరోపించారు.
ఎన్నికల కమిషన్కు తమవారితో నే ఫిర్యాదు చేయించింది
మోదీ 150 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చింది లేదు
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లింది
బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోంది
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లూటీలకు పాల్పడుతోంది
కామారెడ్డి, మెదక్ కార్నర్ మీటింగ్లలో మాజీ సీఎం కేసీఆర్
ప్రజా దీవెన, మెదక్: రాష్ట్రంలోని మిగిలిన రైతులందరికీ రెండు రోజుల్లోగా రైతుభరోసా నిధులను జమచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో ఎన్నికల కమి షన్కు తమవారితోనే ఫిర్యాదు చేయించి రైతు భరోసాను ఆపిం చారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రె స్(congress) చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.మంగళవారo కేసీఆర్ బస్సుయాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని చేరుకోగా జేపీఎన్ చౌరస్తా తో పాటు రాత్రి మెదక్లోని రాందాస్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లలో ప్రసంగించారు.
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసమర్థులు, తెలివితక్కువ వారు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తా రు.మోదీలాంటి అసమర్థుడి పాల న వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట మంటగలిసిందని, రూపాయి విలువ తగ్గిపోయిందని, పదేళ్ల బీజేపీ పాలనలో అభివృద్ది ఆనవాళ్లే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఇచ్చిన 150 హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటూ దేశాన్ని సత్యనాశ్ చేశాడని విమ ర్శించారు. రాష్ట్రంలో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి తెలివి తక్కువ తనంతో సంక్షేమ పథకాలను అమలుచేయడం లేదని స్పష్టం చేశారు.
మోదీతో దేశంలో ఎలాంటి అభివృద్ధి లేదని, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అమలుకు నోచుకోలేదని,జన్ధన్ యోజనలో పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని, కామారెడ్డిలో బీజేపీ గెలిస్తే రూ.30 లక్షలు వేస్తానని చెప్పారని, ఆ మొత్తం మీ ఖాతాల్లో వేశారా అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చుపె ట్టడం, మతరాజకీయం తప్ప బీజేపీకి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్టదని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు ఖాయమని మోదీ, బీజేపీ(BJP) ప్రతినిధులు చెబుతు న్నారని, సీట్లేమోకానీ, మోదీ మళ్లీ వస్తే పెట్రోల్ ధరలు రూ.400కు పెర గడం గ్యారెంటీ అని అన్నారు. ఎన్డీ యేకు 200 సీట్లు కూడా దాటవని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వ మేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాం లో అమలైన పథకాలను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రద్దుచేసిందని కేసీఆర్ విమర్శించారు. కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని, తాగునీటి సరఫరా బంద్ అయిందని విరుచు కుపడ్డారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్(congress)సర్కారు లూటీలకు పాల్పడు తోందని దుయ్యబట్టారు. తొమ్మి దేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెప్ప పాటు కాలం కూడా కరెంటు పోలేద న్నారు. రేవంత్రెడ్డి కొత్త జిల్లాలను తొలగిస్తానంటున్నారని, కామారెడ్డి(Kamareddy) జిల్లా ఉండాలా,వద్దా అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. మెదక్ జిల్లా నూ రద్దుచేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
Congress stop rythu bharosa