Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mayday celebrations:138వ మేడేను జయప్రదం చేయండి

అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం మేడేను ఘనంగా వాడవాడన, గ్రామ గ్రామాన జరపాలని సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు - కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిలువేరు జానయ్య లు పిలుపునిచ్చారు.

పోస్టర్ ఆవిష్కరించిన కమ్యూనిస్టు నాయకులు

ప్రజాదీవెన, శాలిగౌరారం: అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం మేడేను(Mayday) ఘనంగా వాడవాడన, గ్రామ గ్రామాన జరపాలని సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు – కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిలువేరు జానయ్య లు పిలుపునిచ్చారు.

శాలిగౌరారం(shaligowraram )మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో 138 వ మేడే కు సంబంధించిన ఐఎఫ్ టీయూ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం,శ్రమకు తగిన వేతనం,8గంటల పని దినం కోసం హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించిన రోజు మేడే ను స్ఫూర్తిగా తీసుకొని మోడీ(Modi)ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలపై పోరాడాలని అన్నారు.కులం,మతం పేరుతో ప్రజలు, కార్మిక వర్గం మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ వైశ్యామ్యాలను పెంచి పోషిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ఆదాని, అంబానీలకు మోడీ దారాదత్తం చేస్తూ వారి ఆదాయాలు పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల ఒకవైపు భారం మోపడంతో సామాన్యుల ఆదాయాలు తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక 49 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను(Labour Code) యాజమాన్యాలకు అనుకూలంగా తెచ్చారని విమర్శించారు. 2019 రోడ్డు రవాణా సేఫ్టీ బిల్లు డ్రైవర్ల వృత్తికి మరణ శాసనంగా మారిందని అన్నారు.

దేశంలో 45 కోట్ల పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. పదేళ్ల పాలన ఒక ట్రైలర్ మాత్రమేనని అసలైన విధానాలను మళ్లీ గెలిస్తే నిరూపిస్తామని మోడీ తెలపడం ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పదేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వీరిని గద్దభించేందుకు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలియజేశారు.

కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు- కూలీ సంఘం జిల్లా నాయకులు వేముల శంకర్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు వెంకన్న, ఇఫ్టూ నాయకులు, మల్లయ్య, వెంకన్న,లింగయ్య, ప్రభాకర్, రాజు,ముత్తయ్య, దేవయ్య,సోమన్న తదితరులు పాల్గొన్నారు.

138th may day celebrations in shaligowraram