Candidate final list: లెక్క తేలింది.. పోరు మిగిలింది
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది.
నల్లగొండ బరిలో 22
భువనగిరి 39 మంది
స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
ఇక పెరగనున్న పొలిటికల్ హీట్
ప్రజా దీవెన నల్గొండ బ్యూరో: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్ధుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల(Nominations) ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్ధుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నల్గొండ(Nalgonda) పార్లమెంట్ పరిధిలో 22 మంది, భువనగిరి 39 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సోమవారం నామినే షన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో నల్లగొండలో 9, భువనగిరిలో 12 స్వతంత్ర అభ్యర్థులు విత్ డ్రా(With draw)చేసుకున్నారు. ఈ మేరకు ఫాం-5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
నల్లగొండలో 2… భువనగిరిలో 3 ఈవీఎంలు
ఒక స్థానంలో 15మంది అభ్యర్ధులకు మించితే రెం డు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. నల్లగొండ(Nalgonda)బరిలో 22 మంది ఉండటంతో 2 ఈవీఎంలు, భువనగిరిలో 39 మంది అభ్యర్ధులు ఉం డటంతో 3 ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్ధులను(Independent candidates) ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.
నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు…
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్ధులెవరో తేలిపో యింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచిప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్ధు లు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమ య్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.
22 Candidate contest in Nalgonda parliament