–శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి.
–10 పీట్ల లోపు విగ్రహాలు వల్లభ రావు చెరువు, 10 ఫీట్ల పైన విగ్రహా లు 14 మైలు వద్ద నిమజ్జన కార్యక్రమం.
–గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకు లు శాంతి సంఘం సభ్యులతో స మావేశంలో నల్లగొండ డీఎస్పీ కె. శివ రాంరెడ్డి
Ganesh immersion: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రం పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభయాత్ర (Ganesh immersion) శాంతియుత వాతావరణంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రతా చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత వాతావరణంలో నిమర్జనమునకు సహకరించాలని పట్టణ కేంద్రంలోని పోలీసు ఆడి టోరియంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, శాంతి సంఘం సభ్యుల, గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలీసు (Police) వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని, శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్ (Traffic) ఇబ్బందులు కలగకుండా తమకు కేటాయించిన మార్గం గుండా మాత్రమే వెళ్లాలని అన్నారు.
అవసరమైన అన్ని ప్రాంతాలలో సిసి కెమెరాలను, ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లును నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గంలో ఇతర శాఖల యొక్క సమన్వయముతో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా పట్టణ కేంద్రంలోని 10 ఫీట్ల లోపు విగ్రహాలు నిమజ్జనం కొరకు వల్లభరావు చెరువు నందు ఏర్పాటు చేశామని 10 ఫీట్ల పై బడిన విగ్రహాలు 14 మైలు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి విషయాన్ని గమనించగలరని అన్నారు.
నిమజ్జనం సందర్భంగా డీజే (DJ)లు, సౌండ్ సిస్టంలు, బాణాసంచా (Crackers) కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. ముఖ్యంగా యువకులు నిమజ్జనం సమయంలో సంయమనం పాటించాలని అన్నారు వినాయక నిమజ్జన శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ డానియల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ క్రాంతి ఎస్.ఐ నాగరాజు, సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.