మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్గొండ ప్రీమియర్ లీగ్-5 పోటీలకు విశేష స్పందన లభిస్తుందని నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోని రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం ఎన్జి కళాశాలలోని జరుగుతున్న క్రికెట్ లీగ్ దశ పోటీలను పరిశీలించి అనంతరం క్రీడాభిమానులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నాడని అన్నారు.
పట్టణ ప్రజలు, వివిధ ప్రాంతాల క్రీడల అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీడా పోటీలను తిలకిస్తూ క్రీడాభిమానాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నయి క్రీడా పోటీల్లో మొత్తం 64 జట్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు.ఈనెల 20 వరకు క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆర్గనైజర్స్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, ప్రదీప్ నాయక్, ఆలకుంట్ల మోహన్ బాబు, ఏర్పుల రవి, ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, శ్రీధర్, ఏర్పుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.