ప్రజా దీవెన ,నల్గొండ టౌన్: నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ 43వ మహాసభల గోడ పత్రిక ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్ మాట్లాడుతూ “అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నారు.వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అనే ఉద్ధేశ్యంతో పనిచేస్తూ వివేకానందుని స్ఫూర్తితో, అంబేద్కర్ ఆశయ సాధనలో విద్యార్థులను జాతీయవాదులుగా చేస్తున్న విద్యార్థి సంఘం అన్నారు.
అన్ని రంగాల విద్యార్థుల సమస్యల పరిష్కారమే ద్యేయంగా అనునిత్యం పనిచేస్తూనే, ఎన్నో విద్యార్థి నిర్మాణాత్మక కార్యక్రమాలను నిత్యం చేస్తూనే,సామాజిక ఉద్యమాలను కూడా నిర్వహిస్తుంది. ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది ఏబీవీపీ యొక్క 43వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో డిసెంబర్ 23,24,25 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభలలో తెలంగాణలో నెలకొని ఉన్న విద్యారంగ,రాష్ట్ర,నిరుద్యోగ సమస్యలపై తీర్మానాల ప్రవేశపెట్టి ఉద్యమ కార్యచరణ ప్రకటించడం జరుగుతుందని,ఈ మహాసభలకు విద్యార్థులు, మేధావులు,నిరుద్యోగులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి విగ్నేష్, శివాజీ, చరణ్, నవీన్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.