–ఎంజీయూ ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్
Acharya Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) వైస్ ఛా న్స్ లర్ గా ఆచార్య అల్తాఫ్ హు స్సేన్ (Acharya Altaf Hussain)బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నియామకాలు వాటి కూర్పు, విద్యా కమిషన్ ఏ ర్పాటు వంటి చర్యలు ఉన్నత విద్య పట్ల స్పష్టమైన వైఖరి దార్శి నికతకు నిబద్దతకు, నిదర్శనం అన్నారు. రెండవ పర్యాయము నల్లగొండ ఎంజీయూ కు సేవలం దించే అవకాశం రావడం అదృ ష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన ఉన్నత విద్యకు సూక్ష్మ స్థాయి పరిశీలన, సారూప్యత ఉన్న విభాగాల సంఘటిత కార్యాచరణ పరస్పర సహకారాలు మరియు నైపుణ్యాభివృద్ధి (Skill development) అవసరమన్నా రు.
గతంలో ఇక్కడ సేవలందించిన దృష్ట్యా మరొక్క మారు అన్ని శాఖల అధికారులు అధ్యాపకు లతో చర్చించి స్పష్టమైన ప్రణాళిక తో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి (Registrar Acharya Alawala Ravi), ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళు అరుణప్రియ , మారం వెంకటరమణారెడ్డి , ప్రేమ్ సాగర్, సుధారాణి, అధికారులు మిరియాల రమేష్, దోమల రమేష్, అన్నపూర్ణ, రేఖ, రూప, వసంత, మాధురి, సబీనా హెరాల్డ్ తదితర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.