–జనాభా దామాషా ప్రకారం నిధు లు కేటాయించాలి
Agricultural Labor Union: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల (Agricultural labor union and farmers’ unions) ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (Agricultural Labor Union) జాతీయ కౌన్సిల్ సభ్యురాలు దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఇటీవల సమర్పించిన బడ్జెట్ దళితులను వ్యవసాయ కార్మికు లను పూర్తిగా విస్మరించాయని, ఇది భారత రాజ్యాంగానికి స్పష్టమైన ఉల్లంఘన అని అన్నారు భారతదే శంలోని దళితులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు మరియు అసంఘటిత రంగాలలో ఉపాధి పొందుతున్నారని ఇది వారి నిరంతర సామాజిక మరియు ఆర్థిక అట్టడుగున జీవనం విధానం ఉన్నట్లు అర్థమవుతుంది.
సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తగిన బడ్జెట్ను కేటాయించడం లేదని విమర్శించారు. గత దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయనీ. వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు జరగలేదనీ నాయకులు విమర్శించారు. గతంలో కేటాయించిన బడ్జెట్ ప్రకారం కేటాయించిన నిధులు కూడా తరచుగా తగ్గించబడుతున్నాయని అన్నారు.నీతి అయోగ్ సిఫార్సుల ప్రకారం దళితుల జనాభా ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రావాల్సిన కేటాయింపులు దాదాపు 16.2% ఉన్నాయి కానీ పైన పేర్కొన్న షెడ్యూల్డ్ కులాల కోసం అంచనా వేసిన కేటాయింపులు గత 10 సంవత్సరాల బడ్జెట్ అంచనాలలో బడ్జెట్లో 11% దాటలేదని అన్నారు.
షెడ్యూల్డ్ కులాలకు కేటాయింపులు కేవలం అంకెలే కానీ ఫోకస్డ్ స్కీమ్లకు (Focused schemes) సరిపడా బడ్జెట్తో అందించడం లేదన అన్నారు. ఎస్సీలకు కేటాయించిన మొత్తం రూ. 1,65,493 కోట్లు, ఇది దాదాపు మధ్యంతర బడ్జెట్కు సమానంగా ఉంటుంది. లక్ష్యం లేని కేటాయింపుల ట్రెండ్ కొనసాగుతోందనీ అన్నారు. దాదాపు 3.2% (రూ.46,195 కోట్లు) మాత్రమే నేరుగా ఎస్సీలకు చేరుతోందనీ అన్నారు. భారతదేశం అంతటా దళిత హక్కుల కోసం వాదించే సంస్థలు దేశవ్యాప్త నిరసనను నిర్వహిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ (ఎస్సిఎస్పి)ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని, ప్రయివేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాల ని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాలను సామాజిక అభివృద్ధిలోకి తీసుకురావడానికి బడ్జెట్లో కేటాయింపులను సమీక్షించలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను ఆపాలని మరియు బ్యాక్లాగ్ పోస్ట్లను భర్తీ చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి నిధుల కేటాయింపు మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. విద్యా, ఉపాధి మరియు పారిశ్రామిక రంగాలలో షెడ్యూల్డ్ కులాల వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తగిన వనరులను అందించడం మరియు సాధికారత ను పెంచాలని కోరారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్ల రాజ్యాంగ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో వ్యకాస పట్టణ ఉపాధ్యక్షుడు పనస చంద్రయ్య సిఐటియు నాయకులు పల్లె నగేష్, ప్రజా సంఘాల నాయకులు దండెంపల్లి మారయ్య, జ్యోతి, పామనగుండ్ల కలమ్మ, రాజు, మాధవి, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.