— నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Ai Reddy Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాద కద్రవ్యాల నిర్మూలనలో భాగంగా, ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రం (By maintaining the Telangana state as a drug free state) గా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar), ఐపీఎస్ నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత (Drug free) జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ (Mission Transition)ను తీసుక వచ్చినoదున ఇందులో భాగంగా యస్.పి ఆదేశాల మేరకు, డిఎస్పి నల్లగొండ (DSP Nalgonda)పర్యవేక్షణలో తేదీ 10 ఆగస్టు, 2024 ఉదయం 10.00 గంటలకు పోలీస్ స్టేషన్ లో గంజా యి కేసులలో ఉన్న నిందితులని, గంజాయి అలవాటైన బానిసలను మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే అనర్థాలు, దుష్పరిణామాలు గురించి వివరిస్తూ వారి తల్లి దండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది.
తల్లిదండ్రులకి వారి పిల్లల కదళికలని, అలవాట్లని ఎప్పటికప్పుడు కపిపెడుతూ ఉం డాలని, తప్పు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే దానిని సరిచేయాలని, అలా కాకుండా, వారిని వెనకేసుకు రావడం వల్ల మేము తప్పుడు పనులు చేసిన మా తల్లిదండ్రులు నన్ను ఏమి అనరు అని వారు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసే అ వకాశం ఉంది అని హెచ్చరించారు. కావున తల్లిదండ్రులు (parents)స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఏమాత్రం తమ పిల్లల ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన లేదా మత్తు పదార్థాలకు బానిసైన వెంటనే వారిని బాధ్యతగా కౌన్సిలింగ్ కి తీసుకొని వచ్చి మత్తు పదార్థాల వ్యసనానికి దూర మయ్యేలా మరియు మరి బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని సీఐ రాజశేఖర్ రెడ్డి (Ai Reddy Rajasekhar Reddy)తెలిపారు.