All India Democratic Women’s Association: ప్రజా దీవెన నల్లగొండ టౌన్ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (All India Democratic Women’s Association)(ఐద్వా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్టోబర్ 21 22 23 తేదీలలో జరిగే ఐద్వా 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ దొడ్డి కోమరయ్య భవన్ లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళలపై జరిగే హత్యలు, హత్యాచారాలు నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రోజు రోజుకు మహిళలపై వృద్ధులపై చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
ఈ మహాసభలలో *(congress) గత మూడు సంవత్సరాలుగా సంఘం నిర్వహించిన కార్యక్రమాలు సమీక్షించుకుని భవిష్యత్తులో సంఘం నిర్వహించవలసిన ఉద్యమాలు పోరాటాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల్లో ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి బృందా కారత్, వక్తలు ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, ఇంకా మరి కొంతమంది వక్తలు పాల్గొంటారని అన్నారు. ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభ ప్రారంభ సందర్భంగా అక్టోబర్ 21న జరిగే బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఐద్వా వార్డు కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు (Petrol Diesel Gas Prices)_తగ్గించాలని కూడా ధర్నాలు, నిరసనలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)ఒకటి మాత్రమే అమలు జరిగిందని మిగతా వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఇవ్వటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మహాసభ అనంతరం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్షురాలు తుమ్మల పద్మ, కనుకుంట్ల ఉమారాణి, పుష్పలత, కవిత, దేవి, తులసి కరుణ తదితరులు పాల్గొన్నారు.