Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Altaf Hussain: నాక్ ఏ గ్రేడ్ లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలి

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) ఉపకులపతిగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ (Altaf Hussain) భాద్యతలు స్వీకరించారు. ఎంజియు బాధ్యతలు స్వీకరించిన ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ అధ్యాపకులతో రాబోవు నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ (NAC Accreditation A Grade) సాధనకు అధ్యాపకుల పాత్ర పై దిశా నిర్దేశం చేశారు. అధ్యాపకులు సమయపాలన, బోధన పరిశోధన పై దృష్టి సారించి విద్యార్థులలో క్రమశిక్షణ, జిజ్ఞాసను పెంపొందించే ప్రయత్నం చేయాలన్నారు.

విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ (Biometric Attendance) విధానాన్ని మరల అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా 75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నట్టు, ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ మూల్యాంకనాలు సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాళ్లు, అరుణప్రియ, సుధారాణి వెంకటరమణారెడ్డి, ప్రేమ్సాగర్, డీన్లు సరిత, వసంత, రేఖ, ఆకుల రవి, దోమల రమేష్, మిర్యాల రమేష్, మాధురి, రూప, మద్దిలేటి, ఉపేందర్ రెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.