–ఎంజియూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి
Aluvala Ravi:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బయోటెక్నాలజీ (Biotechnology) రంగంలోజీవజా లానికి సేవలతో పాటు అపారమైన వ్యాపార అవకాశాలున్నాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University)రిజి స్ట్రార్ ఆచార్య అలువాల రవి పేర్కొన్నారు. విద్యార్థుల గ్రాడ్యు యేషన్ దినోత్సవంలో (students graduation day) మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎమ్మెల్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ఉత్స వాన్ని బయోటెక్నాలజీ శాఖ ఆధ్వ ర్యంలో జరిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడు తూ జీవజాలానికి సేవతో పాటు బయోటెక్నాలజీ రంగంలో (In the field of biotechnology)మంచి వ్యాపార అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచానికి వ్యాక్సిన్ (vaccine) రాజధానిగా హైదరాబాద్ ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు వివరిం చారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సూక్ష్మంగా పరిశీ లించి ఔషధాలు చికిత్స విధానా లకు బయోటెక్నాలజీ రంగం విశిష్ట సేవలను గుర్తు చేశారు. ఈ సంద ర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా మాట్లాడుతూ బయో టెక్నాలజీ రంగంలో విశిష్టమైన పరిశోధనలు చేస్తూ మేలైన ఫలితాలను అందించిన సంస్థలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు తమ ఎంఎస్సీ లో భాగంగా అధ్యాపకుల పర్యవేక్షణలో చేసిన ప్రాజెక్టులకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా ప్రేమ్సాగర్, డా మాధురి, డా శివరాం తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.