–రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి
Alwala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో (Mahatma Gandhi University, Arts College NSS) ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాల్లో వారి సేవలు మననం చేస్తూ అధికారులు విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి (Alwala Ravi) మాట్లాడు తూ తెలంగాణ ప్రజలపై అణిచి వేతలు, దోపిడీ దాస్టికాలు, ఎండగడుతూ వారి ఆర్తిని ఆకాంక్షలను ఆశయంగా, తన విశ్లేషణలతో మహా ఉద్యమంగా మలచిన తెలంగాణ అస్తిత్వ పతాక ఆచార్య జయశంకర్ అని కొనియాడారు.
ఆద్యంతం శ్రమ, ఆత్మవిశ్వాసం, త్యాగాలు, పోరాటాల తో (Hard work, self-confidence, sacrifices, struggles)నిండిన వారి జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నీళ్లు నిధులు నియామకాల నినాదాలను ఆత్మగౌరవ పోరాటంగా మలచడంలో వారి పాత్ర కీలకం అన్నారు. అధ్యయనం విశ్లేషణలు సామాన్యులకు చేరవేసి సామాజిక రాజకీయ ఉద్యమ వ్యూహాలతో బలమైన పునాదులు వేశారన్నారు. వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా మద్దిలేటి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా వగ్గు సైదులు, డా ఆనంద్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.