Academic proposals: అకాడమిక్ ప్రతిపాదనలకు ఆమోదం
వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, పీహెచ్డీ, పలు సంస్థలతో ఎంఓయూ తదితర అకాడమిక్ అంశాలకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అకాడమిక్ సెనేట్ సమావేశంలో పలు అకాడమిక్ ప్రతిపాదనలను ఆమోదించారు.
ప్రజా దీవెన నల్గొండ టౌన్: వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, పీహెచ్డీ, పలు సంస్థలతో ఎంఓయూ తదితర అకాడమిక్ అంశాలకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University) ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అకాడమిక్ సెనేట్ సమావేశంలో పలు అకాడమిక్ ప్రతిపాదనలను ఆమోదించారు.
శుక్రవారం ఎంజీయులో(mgu) సమావేశం ఏర్పాటు చేసి నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన వివిధ కోర్సులు, ఇంజనీరింగ్ విభాగంలో సీట్ల పెంపు, సిలబస్ లో మార్పులు, పీహెచ్డీ, వివిధ సంస్థలతో జరిగిన అవగాహన ఒప్పందాలు తదితర అంశాలపై కులంకుశంగా సేనేట్లో చర్చించి ఆమోదించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు సామాజిక అవసరాల దృష్ట్యా ప్రణాళికలు అవసరమన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని విద్య ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతి ఆచార్య గంగాధర్, మాజీ రిజిస్ట్రార్ లు ఆచార్య నరేందర్ రెడ్డి, ఆచార్య యాదగిరి, రిజిస్టర్ ఆచార్య అలువాల రవి, ఓ ఎస్ డి ఆచార్య అంజిరెడ్డి, ఐక్యూ ఏసీ డైరెక్టర్లు డా. మిరియాల రమేష్, కళాశాలల ప్రిన్సిపాల్ మారం రమణారెడ్డి, డా. ప్రేమ్ సాగర్, అరుణప్రియ, సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి, సెనేట్ సభ్యులు, పాలకమండలి సభ్యులు డా. కౌత శ్రీదేవి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు, బిఓఎస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
Approval of academic proposals