ప్రజాదీవెన, నల్గొండ: నాణ్యమైన ఉపాధ్యాయ విద్యార్థి అందించేందుకు,ప్రతి కళాశాలలో విద్యార్థుల హాజరు ఉండడంతోపాటు నిరంతర బోధన సాగాలి ఎంజియూ పరిధిలోని బిఈడి కళాశాల యజమాన్యాలు ప్రిన్సిపాల్ ల సమావేశంలో విసి అల్తాఫ్ హుస్సేన్ విద్యా వ్యవస్థకు మూల స్తంభాలు ఉపాధ్యాయులను తయారుచేసే విద్యా శిక్షణ కళాశాలలు. ప్రస్తుతమ యూనివర్సిటీ నిబంధన మేరకు కళాశాలలను నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులు తయారు చేయాల్సిన గురు తరమైన బాధ్యత విద్యా శిక్షణ కళాశాలపై(B.Ed, B.PEd, స్పెషలైజేషన్, ఎంఈడి) ఉందని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు.
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఎంజియూ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల బిఈడి, ఎంఈడి, బిపిఈడి బిఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ తో అకాడమిక్ విషయాలు, కళాశాలల నిర్వహణపై వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ శిక్షణ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వం నిబంధనలు , NCTE నిబంధనలు పాటిస్తూ కళాశాల నిర్వహించాలని సూచించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు కచ్చితంగా ఉండాలని ఆ దిశగా అధ్యాపకులు నిరంతరం పాఠ్యాంశాలను బోధించాలని తెలిపారు. ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఇచ్చే శిక్షణ లో ఉత్తమమైన ప్రవర్తన ఉపాధ్యాయిని యొక్క లక్ష్యాలను తెలియచేస్తేనే భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులు తయారుచేసిన వాళ్ళం అవుతామన్నారు.
అన్ని కళాశాలలో మౌలిక వసతులు ఉండాలని సూచించారు నిబంధనలు పాటించని కళాశాలపై యూనివర్సిటీ చర్యలు తీసుకుంటుందని తనదైన శైలిలో చురుకలు వేశారు. పలు బిఈడి కళాశాల యజమాన్యాలు ప్రిన్సిపల్ అడిగిన అంశాలకు సమాధానం చెప్పారు. మారిన సిలబస్ పై యూనివర్సిటీ పరిధిలో అధ్యాపకులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం చేస్తామన్నారు. , NCTE-PAR నిర్విత గడువు లోపల పూర్తి చేయాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాలలు రెండు ఒక కుటుంబ వ్యవస్థ లాంటివని అందుకు యూనివర్సిటీ నిబంధనలు పాటిస్తూ అవసరమైన సూచనలు సలహాలు తీసుకొని ఉత్తమ ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులు తయారు చేయడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
అకాడమిక్ ఆడిషన్ డైరెక్టర్ వై ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓఎస్డి ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ డా సురేష్, డా జయంతి, అమరేందర్, వివిధ కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.