Bathukamma celebrations: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో (Under NSS) జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన తెలంగాణ పండగ బతుకమ్మ సంబరాలను (Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. మొదటగా సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, పరీక్షల విభాగము మరి యు పరిపాలన విభాగాల వారు పూలతో బతుకమ్మలను అలం కరించి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సంబురంగా బతుకమ్మను ఆడా రు. కార్యక్రమానికి ముఖ్య అతి ధిగా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి (Anji Reddy)హాజరై అధ్యాపకులకు, విద్యార్థి నులను ఉద్దేశించి ప్రసింగించారు.
ప్రకృతిలో జరిగే మార్పులను, పం ట దశలను ఆడ పడుచులకు ప్రతీ కాత్మకంగా సాంప్రదాయ రీతిలో, సంస్కృతిగా తెలంగాణా సమాజం జరుపుకుంటుదన్నారు. మంగళ వారం తెలంగాణా ఆస్తిత్వ చి హ్నంగా నిలిచిoదన్నారు. అనం తరం బతుకమ్మలను తయా రుచేసిన అధ్యాపక అధ్యాపకేతర బృందాలను (Non-academic teams)ప్రత్యేకంగా అభి నందించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపాల్ లు డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ వెంకట రమణా రెడ్డి , అరుణ ప్రియ, డాక్టర్ ఉపేందర్ రెడ్డి ,ఎగ్జామినేషన్ హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్ , అసిస్టెంట్ రిజిస్టర్ మాధవి, మరియు ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. శేఖర్, డాక్టర్ ఒగ్గు సైదులు, డాక్టర్ శ్రీనివాసు, హరికిషన్ రావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు హాజరయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
