Bhima Ganesha: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీ నే యధావిధిగా కొనసాగించాలని సిఐటియు (CITU) జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ, తిప్పర్తి సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్ (Bhima Ganesha)లు డిమాండ్ చేశారు.
సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ (Tipperthy Model School)వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కార్మికులు అనేక వడి దుడుకులను ఎదుర్కొని బిల్లులు సకాలంలో వచ్చిన రాకున్నా అప్పులు తెచ్చిపెట్టి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వచ్చారని అన్నారు.కానీ మోడల్ స్కూల్ (model scholl) లో వంట వండటానికి ఎలాంటి వంట షెడ్లు లేకపోవడంతో ఆరుబయట వంట చేయడం వలన గాలికి మంట సరిగా తగలక కొన్ని సందర్భాలలో వంట పలుకులుగాను మరికొన్ని సందర్భాల్లో మెత్తగాను కావడం వలన వంట షెడ్డు లేక ఇదంతా ఇబ్బంది అవుతుంది అని కార్మికులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహారికి కి చెప్పినందుకు నన్నే ప్రశ్నిస్తారా అని కక్షగట్టి మిమ్ములను ఎలాగైనా తొలగిస్తానని అనేకమార్లు బెదిరిస్తూ సమాచారం లేకుండా ఈ నెల ఒకటో తారీకు వంట చేయకుండా ఆపడం జరిగిందని అన్నారు. పోలీస్ వారిని పెట్టి కార్మికులను అనేక ఇబ్బందులకు , భయాందోళనలకు గురి చేశారని అన్నారు. వెంటనే సదరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరి పై చర్య తీసుకొని కార్మికులను యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పోలగాని పద్మ, పల్లె సైదమ్మ, దారమళ్ళ స్వప్న, చెడుపల్లి కౌసల్య, గౌతమి, వంగూరి ఇంద్ర, పల్లె లావణ్య తదితరులు పాల్గొన్నారు
భీమగాని గణేష్
సిఐటియు మండల కన్వీనర్