Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Biotechnology: బయో ఆధారిత ఉత్పత్తులదే భవిష్యత్తు

–సి డి ఎఫ్ డి శాస్త్రవేత్తలు

Biotechnology:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ (Biotechnology)విభాగం ఆధ్వ ర్యంలో బయోటెక్నాలజీ రంగంలో భారత భవిష్యత్తు బయో e3 పా లసీ – సి డి ఎఫ్ డి (C D F D)గైకొన్న చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంటర్ ఫర్ డిఎన్ఏ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భారత ప్రభుత్వo, శాస్త్రవేత్తలు, డా మధుసూదన్ రెడ్డి, డా రమేష్, డా యతీష్, సు బ్బారెడ్డి (Government of India, Scientists, Dr. Madhusudan Reddy, Dr. Ramesh, Dr. Yatish, Subba Reddy) సంస్థ యొక్క ఉద్దేశాలు పరిశోధనలు అవకాశాలపై విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా రమేష్ మాట్లా డుతూ రాబోవు రోజుల్లో బయో ఆధారిత ఇంధన వనరుల అభి వృద్ధి మరియు వస్తువుల తయారీ పై, బయో e3 (ఎన్విరాన్మెంట్ ఎకా నమీ ఎంప్లాయిబిలిటీ ) విధానం పర్యావరణం, ఆర్థికం మరియు ఉద్యోగిత పెంపు కేంద్రంగా పరి శోధనలు జరుగుతున్నట్లు వివ రించారు. భవిష్యత్తు ఇంధన అవసరాలన్నీ బయో ఆధారితం గానే తయారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తులు, వ్యర్ధాలు నుండి ప్రస్తుతం ఎతనాల్ మాత్రమే సంశ్లేషణ జరుగుతోందని రాబోవు రోజుల్లో మానవాళి అవసరాలు తీర్చగలిగే మరిన్ని ఉత్పత్తులకు అవకాశాలు ఉన్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థిక పరిపుష్టి తో పాటు అనేక ఉపాధి అవకాశాలు (Employment opportunities) ఈ రంగంలో ఉన్నట్లు తెలిపారు. సి డి ఎఫ్ డి ద్వారా అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నట్లు యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా కార్యశాలలు శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రతి ఏడూ పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా ప్రేమ్సాగర్, శాస్త్రవేత్తలు మధుసూదన్ రెడ్డి, సుబ్బారెడ్డి, యతీష్, రమేష్, రామచందర్ గౌడ్, తిరుమల, సమ్రీన్ కాస్మి, ప్రియదర్శిని, తిరుపతి తదితర, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ బాటని, ఐపిసి విద్యార్థులు పాల్గొన్నారు.