Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bommagani Raju: రోడ్లు ఊడ్చుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలక్టరేట్ ముందు 22 వ రోజు రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ బొమ్మగాని రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నిన్న జరిగిన చర్చలు నిరాశను మిగిల్చాయాని , రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతు గా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మురళీ కృష్ణ, పట్టణ కార్యదర్శి సూర్య తేజ హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత,సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.