Bonalu: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని పానగల రోడ్డులో గల శ్రీనగర్ కాలనీ పరిధిలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాలు మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ (Councilor) గోగుల రాములమ్మ (Gogula Ramulamma) 18 వార్డు కౌన్సిలర్ హిమబిందులతో పాటు మత్స్య మహిళా సహకార సంఘం జిల్లా డైరెక్టర్ సింగం లక్ష్మీ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై బోనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం (Bonalu) గత 25 సంవత్సరాలుగా సంఘం నాయకులు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి వందలాదిగా భక్తులు బోనాలు సమర్పించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుండు వెంకటేశ్వర్లు, గొంగిడి లక్ష్మణ్, వెంబడి శ్రీనివాస్, మంగలి పెళ్లి కిషన్, సింగం వెంకటయ్య, కాలనీ మహిళలు భారీగా పాల్గొన్నారు.