Boora Narsaiah Goud: ప్రజా దీవెన, నల్గొండ టౌన్: బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్థిత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఈ పబ్లిసిటీ పెట్టిన ఖర్చు రైతు బంద్ ఇవ్వచ్చు కదా, రైతు భరోసా అనేది లేదు రోజు కో మంత్రి మాట్లాడుతూ రైతుబంధు అయిదు ఎకరాల వరకే అని ఒకటి చెబుతాడు మరో మంత్రి అందరికంటాడు, రైతుల సొమ్ము కాంగ్రెస్ కాంట్రాక్టర్స్ తీసుకుపోయారు.
రైతులకు ప్రభుత్వం బాకీ ఉన్నది రోజు కూలి లకు కోట్లకు బాకీ పడ్డది రుణమాఫీ కూడా ఒక శాంపిల్ అయ్యింది ఇచ్చింది మాత్రం 30 నుంచి 40 శాతం మాత్రమే రైతులకు చేశారు.రైతుకు రైతు బంద్ లేదు, భరోసా లేదు మన జిల్లా మంత్రి పెర్ఫార్మన్స్ సూపర్ చేసేది జీరో హైద్రాబాద్ నది నుండి త్రిబుల్ ఆర్ లక్ష్యం నెరవేరదు పచ్చిగా మోసం చేసిన ఘనత నల్గొండ మంత్రులదే భూపాలపల్లి లో 30 లక్షలు ఇస్తూరు ఇక్కడ కూడా ఇవ్వాలి, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జాడ లేదు అర్హులైన వారికీ రేషన్ కార్డు ఇవ్వాలి ఫీ రియంబుర్స్్మెంట్ ఇవ్వాలి జిల్లాలో 12 కు 11 స్థానాలు ఉన్నాయి యాదాద్రి కు మెట్రో వెయ్యాలన్న జ్ఞానం లేదు ఇక్కడున్న మంత్రులకు లేదు వచ్చే మున్సిపల్ ఎన్నికలో బీజేపీ ను బలపర్చండి.
లక్ష మంది కార్మికులకు విశ్వకర్మ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం ఎక్కడన్నా అవినీతి చేశామా మా నాయకులు ఎప్పుడున్న ఎన్నికలో వచ్చిన బీజేపీ కు ఓటు వెయ్యాలి అన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బిజెపి నాయకులు పిల్లి రామరాజు, బిజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.