Venkat reddy: బ్రాహ్మణ వెల్లెముల రిజర్వాయర్ తో 65 వేల ఎకరాలకు సాగు నీరు
రానున్న మూడు, నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లెముల రిజర్వాయర్ ను నీటితో నింపి 65 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు
— రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, నార్కట్ పల్లి: రానున్న మూడు, నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లెముల రిజర్వాయర్(Brahmin Wellemula Reservoir ) ను నీటితో నింపి 65 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Roads and Buildings and Cinematography
Minister Komatireddy Venkatareddy) తెలి పారు.శుక్రవారం అయన నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం తన స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లేముల లో(Brahmin Wellemula) ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులు భాగ మైన బ్రాహ్మణ వెల్లేముల ప్రా జెక్టు ను(Brahmin Wellemula project ) నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, ఇంజనీరింగ్ అధికా రుల తో కలిసి తనిఖీ చేశారు. అనం త రం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రా హ్మణ వెల్లేముల పూర్తికి చర్యలు తీసుకోలేదని అన్నారు.
తాము అధి కారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రి బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు పూర్తి కి కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే డిసెంబర్ లోపు బ్రాహ్మ ణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేసి 65 వేల నుండి లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. మూసి ప్రక్షాళనతో నల్గొండ జిల్లా ను పూర్తి గా శాశ్వతంగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఇందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తు న్నారని మంత్రి తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షా ళనకు కంకణం కట్టు కున్నట్టున్నా రని, ఆరు నెలల్లో మూసి సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న మూడు న్నర సంవత్సరాలలో మూ సిని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దు తామని మంత్రి వెల్లడించారు. నకి రేకల్ శాసనసభ్యులు వేముల వీరే శం జిల్లా కలెక్టర్ నరసింహ హరిచం ద్ర ఇంజనీరింగ్ అధికారులు తది తరులు ఉన్నారు. అంతకు ముం దు మంత్రి బ్రాహ్మణ వెళ్లెముల పం ప్ హౌస్,రిజర్వాయర్ కట్టను పరిశీలించారు.
Brahmin Wellemula Reservoir irrigation