Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Former minister srinivas goud:విద్యావంతుడు రాకేశ్ రెడ్డి విజయం ఖాయం

తెలం గాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎ స్ పాత్ర చాలా ఉందని, మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలి పారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడాను పట్టభద్రులు గుర్తించాలి
బూత్ స్థాయి కార్యకర్తల సమా వేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్(BRS) పాత్ర చాలా ఉందని, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎంతో కృషి చేశారని తెలి పారు. ప్రతి ఓటరుకు తెలంగాణపై, బీఆర్ఎస్ పై అమితమైన ప్రేమ ఉందని వారందరినీ కదిలించి మొదటి ప్రాధాన్యత ఓటు వేయిం చేలా పనిచేయాలన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభ ద్రుల శాసన మండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివా స్ గౌడ్ పిలుపునిచ్చారు.

నల్లగొండ(Nalgonda) లో బుధవారం ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావే శంలో ఆయన పాల్గొని మాట్లా డారు. కాంగ్రెస్ అభ్యర్థి నేచర్ బ్లాక్ మెయిల్ తత్వమని, అలాంటి వారికి ఓటేస్తే మండ లిలో బ్లాక్ మెయిలర్స్కు అవకాశం ఇచ్చి నట్లు అవుతుందని చెప్పారు. రోజుకో పార్టీ మారి ఆ పార్టీలోని వ్యక్తులనే నిత్యం తిట్టిపో సిన వ్యక్తికి కాంగ్రెస్(Congress) పార్టీ సీటు ఇవ్వటం సిగ్గు చేట న్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పా లంటే విద్యావంతుడు, వినయుడు రాకేశ్ రెడ్డిని భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections)అడ్డ గోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ ఐదు నెలల్లో రాష్ట్రా న్ని సర్వనాశనం చేసి నందున ఈ ఎన్నికల్లో పట్టభద్రులు విచక్షణతో ఆలోచించి తగిని బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ఏం చేస్తుందో పట్ట భద్రులు ఆలోచించి ఓటు(Vote) వేయాల ని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరె డ్డి, కౌన్సిలర్లు అభి మన్యు శ్రీనివాస్, మారగోని భవానీగణేశ్, ఎంపీపీ కరీంపాషా, నాయకులు వంగాల సహదేవ్డ్డి, మెరుగు గోపి, సింగం రామ్ మోహన్ పాల్గొన్నారు.

సూర్యాపేటలో… ప్రజలను వంచించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం అయితే సెంటిమెంట్ తో మాయ చేసి మభ్యపెట్టేది బీజేపీ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేవలం పదేండ్ల కాలంలో తెలంగాణను(Telangana) దేశానికే రోల్మాడల్గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అని తెలిపారు.మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తో కలిసి జగదీశ్ రెడ్డి బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలో పట్టభద్రులను కలిశారు.ప్రతి పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన కొట్లా డేది బీఆర్ఎస్సే నని పేర్కొన్నారు.

త్వరలో జరుగనున్న వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డి గెలిపించి కాంగ్రెస్, బీజేపీకి(BJP) బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా నిరుద్యోగులు, పట్టభద్రులు, విద్యార్థులు, ఉద్యోగులు, పింఛన్దాదారులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గ్రహించి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కే ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) మాట్లా డుతూ ప్రస్తుతం జరుగబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న ఏనుగుల రాకేశడ్డి బిట్స్పిలానీలో చదివి, అమెరి కాలోని టాప్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ తెలం గాణ కోసం అన్నీ వదులు కొని రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గండూరి ప్రకాశ్, మర్ల చంద్రారెడ్డి, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం జడ్పీటీ సీలు జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

BRS candidate rakesh reddy win mlc elections