BRS KancharlaBhupalReddy ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మండలం పాతూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మహేశ్వరం యాదయ్య గత ఆగస్టు నెలలో రోడ్డు ప్రమాదం లో మరణించడంతో ఆయన పార్టీ సభ్యత్వంతో మంజూరైన బి ఆర్ఎ స్ పార్టీ ప్రమాద బీమా రూ. 2 లక్షల రూపాయల చెక్కును ఆయ న భార్య మహేశ్వరం సుగుణమ్మ కు నల్ల గొండ మాజీ శాసనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి మంగళ వారం అందజేశారు. ఈ సందర్భం గా కంచర్ల మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని, తాము ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని తెలియ జేశారు.
బాధిత మహిళ మహేశ్వ రం సుగుణమ్మ మాట్లాడుతూ తమకు ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కు అందిం చడం తమ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని, తమకు ఏ ఆధారం లేని పరిస్థితులలో పార్టీ తమకు రెండు లక్షల రూపాయల చెక్కులు అందించడం తమకు కొంత వెసులుబాటు కలిగించిందని అన్నారు. దీనావస్తలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ అధ్య క్షులు కేసీఆర్ కు మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డికి రుణపడి ఉంటామని ఎల్లప్పుడు కృతజ్ఞతగా ఉంటామన్నారు.
అదేవిధంగా ఇందుకు మాకు సహ కరించిన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దేప వెంకట్ రెడ్డి, బడుపుల శంకర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాదగొని లింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మాధగోని శ్రీను, సింగిల్ విండో డైరెక్టర్ ధోటి అంజయ్య, మాజీ వార్డు సభ్యులు, గడగోటి శీను, గడగోటి నరసింహ, పుట్టా లింగస్వామి.. సోషల్ మీడియా ఇంచార్జ్ పుల్లెంల శివ, సీనియర్ నాయకులు బెల్లంకొండ సైదులు తదితరులు పాల్గొన్నారు.