Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burri Srinivas Reddy: ఘనంగా లతీఫ్ షా ఉల్లాఖాద్రి దర్గా ఉత్సవాలు

–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Burri Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా అక్టోబర్ 17న జరిగే లతీఫ్ షా ఉల్లాఖాద్రి దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Burri Srinivas Reddy)ఉర్సు కమిటీకి సూచించారు.నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ దామన్ దర్గా ప్రాంగణంలో ఉర్సు కమిటీ వారు ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా నల్గొండ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Burri Srinivas Reddy) పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలోని ఎంతో ఘననీ యమైన చరిత్ర గల సయ్యద్ లతీఫ్ షా వలి ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చుకోవాలని ఉరుసుకు సంబం ధించిన అన్ని ఏర్పాట్లను నల్లగొండ మున్సిపాలిటీ (Nalgonda Municipality)సహకరిస్తుందని తెలిపారు. దర్గా మరమ్మత్తుల కొర కు దాదాపు తొమ్మిది లక్షలు వరకు కేటాయించడం జరిగిందని తెలి పారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఉర్సు ను పట్టణం నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి అధిక జనసాంద్రత వస్తుందని వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

.
అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 17 న ఉత్సవాలు ప్రారంభమవుతాయని. దాదాపు 30 రోజులు ఉర్సు ఉత్స వాలు జరుగుతాయని, స్థానిక మదీనా మసీదు (Medina Mosque)నుంచి గంధం ను నల్లగొండ పలు ప్రాంతాలలో ఊరేగింపు జరుగుతుందని అనంతరం దర్గా కు సమర్పించి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా తెలియజేశారు.*

*నల్లగొండ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ (Abba Goni Ramesh), స్థానిక కౌన్సిలర్ నవీన్ గౌడ్, కౌన్సిలర్లు సయ్యద్ సమద్, ఫసాద్ అలీ బాబా, మహబూబ్ ఆలీ(ఇంతియాజ్) , కొమ్ము శంకర్, సిపిఎం లీడర్ సయ్యద్ హాషం, ఉర్సు కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ జాఫర్, ఇంతియాజ్ హుస్సేన్, మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ మసీఉద్దీన్ అడ్వకేట్, ఎక్స్ ఉర్దూ అకాడమీ మెంబర్ బాబా జీయా యావుద్దీన్, ఈనాందర్&ముతవల్లీలు సయ్యద్ రషీద్ ఖాద్రి, సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రి, గాస్ ఖాద్రి, సల్మాన్ ఖాద్రి, తబ్రేస్ ఖాద్రి, ఓవైస్ ఖాద్రి, సుఫియాన్ ఖాద్రీ, మరియు కమిటీ సభ్యులు మొహమ్మద్ ఫెరోజ్ అలీ, మొహమ్మద్ నసీర్, మహమ్మద్ ఆరిఫ్, ఉర్సు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు