Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burri Srinivas Reddy: వ్యాపారాభివృద్ధితోనే పట్టణాభి వృద్ధి

–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Burri Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Burri Srinivas Reddy) అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని శివాజీ నగర్ రూట్ లో నూతన వెరైటీలతో ఏర్పాటు చేసిన శావర్మ రెస్టారెంట్ ను ఆయన పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో షా వర్మ రెస్టారెంట్ (Shah Varma Restaurant)ఇంతవరకు లేదని హైదరాబాద్కే (Hyderabad) పరిమితమైన ఇటువంటి రెస్టారెంట్లను నల్లగొండ ప్రజల కోసం ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వ్యాపారం అభివృద్ధి చెందితేనే నగరమైన పట్టణమైన అభివృద్ధి చెంచుతుందని జిల్లా కేంద్రానికి నిత్యం అనేకమంది వ్యాపారాల. కోసం ఇతర పనుల కోసం వచ్చి పోతుంటారని ఇందుకోసం పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నారు. రెస్టారెంట్ రుచి.శుచి శుభ్రతతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో 48 వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ (Councilor Yama Kavitha Dayakar), డిఎస్పి శివరాం రెడ్డి, టూ టౌన్ సి ఐ డానియల్ .వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి. టూ టౌన్ ఎస్ఐ నాగరాజు. అనిల్ రెడ్డి. యామ దయాకర్ .పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.