Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Burri Srinivasa Reddy: నాయకులకు పునాది యువజన కాంగ్రెస్

— పార్టీ కోసం సైనికులుగా పని చేయాలి
— కష్టపడి పనిచేసే వారికి తప్పకుం డా గుర్తింపు ఉంటుంది
— నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.
నల్లగొండ నియోజక వర్గంలో యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన నూతన కమిటీకి గురువారం పట్ట ణంలోని ఓ హోటల్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నుముక్కలాటిదని అన్నారు.

యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు. మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొదట యువజన కాంగ్రెస్ లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు చేపట్టాడని అన్నారు.యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.యువజన కాంగ్రెస్ లో పార్టీ కోసం పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉం టుందని స్పష్టం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యువజ న కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. రాను న్న ఎన్నికలలో యువజన కాంగ్రెస్ పార్టీ కూడా తగిన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

గతంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐలో పనిచేసిన వారే ప్రస్తుతం మంత్రులుగా, ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారని అన్నారు. నాయకునిగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ మొదటి మెట్టని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ అంటేనే ఒక శక్తి అని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు తమ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. వీటన్నింటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీతో పాటు యువజన కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ శ్రేణులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏ కార్యక్రమం చేపట్టిన వాటన్నింటినీ విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలలో యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జహంగీర్ బాబా నల్లగొండ మండల అధ్యక్షుడు కెవిఆర్ సతీష్, తిప్పర్తి మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, కనగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె.వి.ఆర్ పవన్ కుమార్ లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి,పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.