Chakilam Srinivas Rao: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బడు గు,బలహీన వర్గాలకు నాడు చకిలం శ్రీనివాసరావు(Chakilam Srinivas Rao) అండగా ఉండి పెద్దదిక్కుగా నిలిచాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ (Shankar Nayak)తెలిపారు.
నల్లగొండ మాజీ,ఎంపీ దివంగత నేత చకిలం శ్రీనివాసరావు (Chakilam Srinivas Rao) 28వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రామగిరి లోని శ్రీనివాసరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లాలో నూతనంగా నిర్మించే పార్టీ కార్యాలయానికి శ్రీని వాస్ రావు (Chakilam Srinivas Rao) భవనం గా నామకరణం చేస్తామని తెలిపారు.ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసు కెళ్లి నిర్ణయం తీసుకోవడం జరుగు తుందని పేర్కొన్నారు.చకిలం శ్రీని వాసరావు ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు.
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (gummala Mohan Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో చకిలం శ్రీనివాసరావు కుమారుడు చకిలం అనిల్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కో టి, అల్లి సుభాష్ యాదవ్, జూల కంటి సైదిరెడ్డి, పోలె జయకుమార్, గాలి నాగరాజు, గాలి రవి, మామిడి కార్తీక్, పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, దాసరి శంకర్, దాసరి విజయ్, చింతపల్లి గోపాల్, మనిమద్దే సాయి తదితరులు పాల్గొన్నారు.